Sunday, May 19, 2024
- Advertisement -

” ఉరి తీయమంటే ఏం చేస్తారు ? ” ఆగ్రహం తో రోజా

- Advertisement -

ఇవాళ అసంబ్లీ దగ్గర రోజా – టీడీపీ ల మధ్య జరుగుతున్న రచ్చ మామూలుగా లేదు. ఒక పక్క టీడీపీ మార్షల్స్ ద్వారా రొజాని లోపలి రానివ్వకుండా అడ్డుకుంటూ ఉంటే మరొక పక్క ఆమె తన దగ్గర ఉన్న కోర్ట్ ఆర్డర్ లు చూపిస్తూ లోపలకి వెళ్ళే ప్రయత్నం చేస్తున్నారు.

ఈ చర్యలో భాగంగా మార్షల్స్ తో పోలీసులతో గొడవ , నిరాహార దీక్ష కి కూర్చోవడం లాంటి పరిణామాలు కూడా చోటు చేసుకున్నాయి. రోజాను సభలోకి అనుమతించకపోవడాన్ని నిరసిస్తూ గవర్నర్ నరసింహన్ ను కలిసి వైసీపీ ఎమ్మెల్యేలు ఫిర్యాదు చేశారు. అనంతరం అక్కడే ఎమ్మెల్యే రోజా మీడియాతో మాట్లాడుతూ టీడీపీ ప్రభుత్వంపై స్పీకర్పై ఫైర్ అయ్యారు. 

ఏపీ సీఎం చంద్రబాబు ప్రభుత్వానికి – స్పీకర్ కు ప్రజాస్వామ్యమన్నా న్యాయస్థానాలన్నా గౌరవంలేదని విమర్శించారు.  ” స్పీకర్ ఉత్తర్వుల మేరకు నన్ను లోపలకి పంపం అని అంటున్న మార్షల్స్ స్పీకర్ ఎక్కువా కోర్టు ఎక్కువా అనేది ఆలోచించుకోవాలి , నన్ను బయటకి గెంటే ప్రయత్నం ఇక్కడ గట్టిగా సాగుతోంది. స్పీకర్ చెబుతున్నారు అంటున్న వీరు ఆయన ఉరితీయమంటే ఉరి తీస్తారా ? ” అని ప్రశ్నించారు. 

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -