Tuesday, April 30, 2024
- Advertisement -

షర్మిల అదేరోజు పార్టీ పేరు ప్రకటిస్తారా?

- Advertisement -

తెలంగాణలో రాజన్న రాజ్యం తెస్తానంటూ షర్మిల సంచలన వ్యాఖ్యలు చేశారు. వైఎస్ఆర్ లేని లోటు తెలంగాణలో ఉందన్న షర్మిల.. తెలంగాణలో రాజన్న రాజ్యం లేదన్నారు. క్షేత్రస్థాయిలో వాస్తవాలను అర్థం చేసుకోవాలని భావిస్తున్నాని షర్మిల తెలిపారు. మరోవైపు తెలంగాణ వ్యాప్తంగా షర్మిల పార్టీ పేరు ఎప్పుడు ప్రకటిస్తారన్న ఉత్కంఠ నెలకొంది.

ఈ నేపథ్యంలో వైఎస్ షర్మిల ఏప్రిల్ 10న పార్టీని ప్రకటించనున్నట్టు తెలుస్తోంది. గతంలో ఆమె తండ్రి దివంగతనేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి 2003లో అదే రోజున చేవెళ్లలో పాదయాత్ర ప్రారంభించారు. 2004లో జరిగిన ఎన్నికల్లో అధికారంలోకి వచ్చారు. ఇదే సెంటిమెంట్ కూడా ఆయన కూతురు షర్మిల ఫాలో అవుతారని అంటున్నారు ఆమె సన్నిహితులు.

ఒకవేళ ఆ రోజు పార్టీ పేరు ప్రకటించకపోయినా.. పాదయాత్ర మాత్రం మొదలు పెడతారని సమాచారం. ఏప్రిల్ పదో తేదీతో వైఎస్ పాదయాత్రకు 18 ఏళ్లు పూర్తవుతాయి. ఈ నేపథ్యంలోనే పార్టీకి సంబంధించి అత్యంత కీలకమైన కార్యక్రమానికి ఆ రోజున ముహూర్తం పెట్టుకున్నారని చెబుతున్నారు.

ఎవరైనా పార్టీ పెట్టుకునే స్వేచ్ఛ ఉంది : పవన్ కళ్యాన్

సీఎం జగన్ లేఖ.. క్షమాపణలు చెప్పిన వలంటీర్లు

రెండో పెళ్ళి చేసుకున్న మంత్రి పువ్వాడ అజయ్ కుమార్..!

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -