వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే రోజా రాజకీయాల్లో ఫైర్ బ్రాండ్ అన్న సంగతి తెలిసిందే. రాజకీయాల్తోపాటు ఫేస్ బుక్లో కూడా చాలా యాక్టివ్గా ఉంటోన్న విషయం తెలిసిందే. ప్రతిరోజు తాను పర్యటిస్తోన్న ప్రాంతాలను గురించే కాకుండా తన కుటుంబ విషయాలను కూడా ఎప్పటి కప్పుడు సో షియల్ మీడియాలో ఆమె పోస్ట్ చేస్తుంటుంది. ఆమెకు ఫేస్బుక్లో రెండు మిలియన్లకు పైగా ఫాలోవర్లు ఉన్నారు.
తాజాగా రోజా ట్విట్టర్లోకి కూడా ఎంట్రీ ఇచ్చారు. ఈ విషయాన్ని తన ఫేస్బుక్ ఖాతాలో తెలిపారు. “Hello #YSRKutumbam, @ysjagan @YSRCParty #myfirstTweet” అని ట్వీట్ చేశారు. అనంతరం కొద్దిసేపటికే మరో ట్వీట్ చేస్తూ.. ‘పేద ప్రజల కొరకు నిత్యావసర వస్తువులు పంపిణీ చేసే చౌక ధరల దుకాణాలను “చంద్రన్న మాల్స్” పేరుతో రిలయన్స్, ఫ్యూచర్ గ్రూప్ (హెరిటేజ్ ) సంస్థలకు అప్పగించి పేదోడి కడుపు కొడుతున్న బాబు. ఈ నిర్ణయాన్ని వెనక్కు తీసుకోకపోతే ఉద్యమిస్తాం’ అని హెచ్చరించారు.
Hello #YSRKutumbam !@ysjagan @YSRCParty #myfirstTweet
— Roja Selvamani (@RojaSelvamaniRK) December 13, 2017