నంద్యాల టీడీపీ గెలుపుకోసం అనుసరించిన విధానాన్నె అన్ని నియేజక వర్గాల్లోను అనుసరించాలని సీఎం చంద్రబాబునాయుడు పార్టీ నేతలకు పిలుపునిచ్చారు. టీడీపీ మంత్రులు – ఎమ్మెల్యేలు – నేతలు – ఆఖరుకు చంద్రబాబు సైతం ఓటర్లను ప్రభావితం చేసినా.. జనాలు మాత్రం వైసీపీకి అండగా నిలిచిన విషయమూ కాదనలేనిదే. దాదాపు 70 వేల మంది ఓటర్లు.. వైసీపీకి మద్దతు తెలిపారు.
పార్టీ నేతలకు బాబు ఇచ్చిన పిలుపుపై వైసీపీ పార్టీ నేత పార్థసారధి నిప్పులు చెరిగారు. న్నికలకు ముందు ఇచ్చిన హామీలన్నీ తక్షణం నెరవేర్చాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేసింది. ఎక్కడ ఓడిపోతామోనన్న భయంతోనే కుప్పలు తెప్పలుగా హామీలిచ్చి ప్రజలను మభ్య పెట్టారని, తమకు ఓట్లు వేయకుంటే అభివృద్ధి ఆగుతుందని ప్రచారం చేసుకున్నారని ఆయన ఆరోపించారు.
ఓటరు మెడపై కత్తిపెట్టి, ప్రలోభపెట్టి గెలవడం నమూనా ఎలా అవుతుందని పార్థసారధి సూటిగా ప్రశ్నించారు. ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చకుంటే చూస్తూ ఊరుకోబోమని, తక్షణం 13 వేల ఇళ్ల నిర్మాణం చేపట్టి లబ్దిదారులకు అందించాలని డిమాండ్ చేశారు. టీడీపీకి దమ్ముంటే పార్టీ ఫిరాయించిన వారితో రాజీనామాలు చేయించి, ఎన్నికలకు రావాలని సవాల్ విసిరారు.