Tuesday, May 7, 2024
- Advertisement -

యామినికి, లోకేష్‌కు ఉన్న సంబంధం ఏంటో చెప్పాలి…వైసీపీ

- Advertisement -

ఎన్నిక‌ల ఫ‌లితాలు అటుంచితే టీడీపీ, వైసీపీ నేత‌ల మ‌ధ్య మాట‌ల యుద్ధం ముదురుతోంది. ఒక‌రొ కొక‌రు ఘాటుగా కౌంట‌ర్లు ఇచ్చుకుంటున్నారు. తాజాగా వైసీపీ నేత సుధాక‌ర్ చంద్ర‌బాబు, లోకేష్‌, మంత్రి దేవినేని ఉమాలపై విరుచుకు ప‌డ్డారు. వినేని ఉమాకు సిగ్గుందా? ఆల్మట్టి డ్యామ్ నిర్మాణం ఎందుకు ఆపలేకపోయారు? నోరు అదుపులో పెట్టుకోవాలంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.

సెలెక్టెడ్ ఆర్టిస్ట్‌లతో టీడీపీ ఆఫీసులో ఇష్టానురీతిగా మాట్లాడిస్తున్నావ‌ని మండిప‌డ్డారు. ఏమీడియా స‌మావేశానికైనా లోకేశ్ కోసం యామిని , యనమల రామకృష్ణుడుకి బదులుగా కుటుంబరావు వస్తారట, సీఎం చంద్రబాబు సమాధానం చెప్పాల్సి వస్తే మరి ఎవరొస్తారో తమకు తెలియడం లేదని ఎద్దేవ చేశారు.యామినికి ఈ లోకేశ్ కు ఉన్న సంబంధం ఏమిటి? ఈమె ఎక్కడి నుంచి వచ్చింది? ఎందుకిలా పేట్రేగి మాట్లాడుతుందో? చిన్నవయసులోనే ఇంత అహం కారం ఎక్కడి నుంచి వచ్చిందో అంటూ నిప్పులు చెరిగారు.కన్నుమిన్నూ కానకుండా, పెద్దా చిన్నా లేకుండా మాట్లాడుతున్నారని మండిపడ్డారు.

ఐటీ గ్రిడ్స్ అశోక్, లోకేష్ మధ్య ఉన్న సంబంధం ఏంటి? అని ప్రశ్నిస్తే ఎదురుదాడులా?. అశోక్‌ని ఎక్కడ దాచారు?.. సిట్ ఏమైంది?.. సిట్ రిపోర్ట్ ఏదీ?.. డేటా స్కాంలో దొంగలెవరు?. చంద్రబాబు.. ఈ విషయంలో నువ్వూ, లోకేశ్ ఎందుకు నోరువిప్పడం లేదంటూ ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు.చంద్రబాబుకు ఓటమి తప్పదని జోస్యం చెప్పారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -