- Advertisement -
టీడీపీ ఎమ్మెల్యే బోడె ప్రసాద్పై కేసు నమోదు చేయాల్సిందిగా ఏపీ పోలీసులను మంగళవారం హైదరాబాద్ హైకోర్టు ఆదేశించింది. గతంలో వైసీపీ ఎమ్మెల్యే రోజాపై బోడె ప్రసాద్ అనుచిత వ్యాఖ్యలు చేసిన సంగతి తెలసిందే. పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేసినా పోలీసు పట్టించుకోకపోవడంతో రోజా హైకోర్టును ఆశ్రయించారు.
బోడే ప్రసాద్పై కేసు నమోదు చేయకపోవడాన్ని రాజ్యాంగ విరుద్ధంగా ప్రకటించి, అతనిపై కేసు నమోదు చేసేలా పోలీసులను ఆదేశించాలని కోరుతూ ఆమె ఆగస్టులో హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఇందులో హోం శాఖ ముఖ్య కార్యదర్శి, విజయవాడ పోలీస్ కమిషనర్, పెనమలూరు ఎస్హెచ్ఓలను ప్రతివాదులుగా పేర్కొన్నారు.
పిటిషన్తో పాటు వీడియో ఫుటేజ్ను న్యాయస్థానానికి సమర్పించారు. దీనిని పరిశీలించిన కోర్టు బోడె ప్రసాద్పై కేసు నమోదు చేయాల్సిందిగా ఆదేశాలు జారీ చేసింది.