గత కొన్ని రోజులుగా వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి, జనసేన విశాఖ ఎంపీ అభ్యర్ధి లక్ష్మీనారాయణ ల మధ్య మాటలయుద్ధం ట్విట్టర్లో తారాస్థాయికి చేరిన సంగతి తెలిసిందే. ఇదలా ఉంటె తాజాగా లక్ష్మీనారాయణ విజయసాయిపై చేసిన వ్యాఖ్యలు ఆసక్తికరంగా మారాయి.
తాను ముందు ఏ పార్టీలోకి కూడా చేరక ముందు అన్ని పార్టీల వారు సంప్రదించారని, అందులో భాగంగానే వైసీపీ వారు కూడా సంప్రదించి తనని వారి పార్టీలో చేరవలసిందిగా కోరారని తెలిపారు. విజయసాయిరెడ్డే స్వయంగా ఫోణ్ చేసి (జగన్ అరెస్ట్) మీరు వృత్తిపరంగా చేశారు. రాజకీయాలు వేరే. మేం కూడా ప్రజల కోసం మంచి పనులు చేయాలనుకుంటున్నాం. తాము కూడా అన్ని పార్టీల్లానే ప్రజల కోసం కష్టపడుతున్నాము… జగన్ కూడా ఇన్ని వేల కిలోమీటర్లు పాదయాత్ర చేసాడు అందుకని తాను కూడా వారి పార్టీలో చేరాల్సిందిగా కోరారని జేడీ లక్ష్మీ నారాయణ వెల్లడించారు.