ఏబీఎన్ ఎండీ రాధాకృష్ణపై కేసు నమోదయ్యింది. వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి జూబ్లిహిల్ష్ పోలీస్టేషన్ లో రాధాకృష్ణపై ఫిర్యాదు చేశారు. ఏబీఎన్ ఛానల్ తన ఆడియో టేపు అంటూ నకిలీ ఆడియో టేపును ప్రసారం చేశారని ఆయన ఆరోపించారు. అస్ట్రేలియాకు చెందిన ఓ వ్యక్తితో తన వాయిస్ అంటూ ఓ కథనాన్ని ప్రసారం చేశారని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఏబీఏన్ ప్రసారం చేసిన కథనంలో మా నాయకుడు జగన్ కు వ్యతిరేకంగా మాట్లాడినట్లు ప్రసారం చేశారని ఆరోపించారు. ఏబీఎన్ ప్రసారం చేసిన కథనంపై విజయసాయి రెడ్డి ఫిర్యాదు చేసినట్టుగా జూబ్లీహిల్స్ ఇన్స్పెక్టర్ కె. బాలకృష్ణరెడ్డి చెప్పారు. కేసు నమోదు చేసె ముందు న్యాయనిపుణుల సలహా తీసుకుంటామని ఆయన ప్రకటించారు. ఈకథనం ప్రసారం చేయడం వెనుక చంద్రబాబు హస్తం ఉందని విజయసాయి ఆరోపించారు. ఐపీసీ 153 ఏ తో పాటు ఎన్నికల కోడ్ ఉల్లంఘన కింద ప్రజాప్రాతినిథ్య చట్టం 125 కింద కేసు నమోదు చేయాలని విజయసాయిరెడ్డి కోరారు.
- Advertisement -
ఏబీఎన్ ఎండీ రాధాకృష్ణపై జూబ్లిహిల్ష్ పోలీస్టేషన్ లో ఫిర్యాదు చేసిన విజయసాయిరెడ్డి
- Advertisement -
Related Articles
- Advertisement -
Most Populer
- Advertisement -
Latest News
- Advertisement -