ట్విట్టర్ లో చురుకుగా ఉండే విజయ సాయి మరో సారి చంద్రబాబుపై ట్విట్టర్ లో తీవ్రంగా విరుచుకు పడ్డారు.వలంటీర్ల వేతనాలపై చంద్రబాబు చేసిన వ్యాఖ్యలకు విజయసాయి కౌంటర్ ఇచ్చారు. రూ.5వేల జీతంతో పనిచేసే గ్రామ వలంటీర్లకు పిల్లను ఇవ్వడానికి ముందుకు రారని చంద్రబాబు చేసిన వ్యాఖ్యలకు ట్విట్టర్ లో ఘాటుగా స్పందించారు.
వలంటీర్ల వేతనాల గురించి చంద్రబాబు ఎకసెక్కలాడుతున్నారని మండిపడ్డారు. అంతేకాదు, అప్రయోజకుడు, చెల్లని కాసు లాంటి మాలోకానికి పెళ్లికాలేదా? అంటూ పరోక్షంగా లోకేశ్ను ఉద్దేశించి ట్వీట్ చేశారు.లక్షలాది మందితో పోటీపడి ఉద్యోగాలు సాధించిన వాలంటీర్లకు ఏం తక్కువని చంద్రబాబు అపశకునాలు పలుకుతున్నారని మండిపడ్డారు.
ఈ మేరకు ట్విట్టర్ లో స్పందించిన విజయసాయిరెడ్డి చంద్రబాబు, నారా లోకేశ్ లను ట్యాగ్ చేశారు.విజయసాయి ట్వీట్పై నెటిజన్లు భిన్నంగా స్పందిస్తున్నారు. శుభాలు పలకడం వారికి మనసు రాదని, వాలంటీర్ల మనోభావాలను దెబ్బతీశారని అందరికి బహిరంగ క్షమాపణ చెప్పాలి ? ఓ నెటిజన్ ట్వీట్ చేశాడు.