వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి మరో సారి ఏపీ సీఎం చంద్రబాబుపై మరో సారి విరుచుకుపడ్డారు. రోడ్ల మీద ఉండే యూ టర్న్ లను చూస్తే, తనకు చంద్రబాబే గుర్తుకు వస్తున్నారని ఆయన ఎద్దేవా చేశారు. యూటర్న్ బోర్డులకు బదులు చంద్రబాబు ఫొటోలు పెడితే బాగుంటుందని అన్నారు. ఢిల్లీలో చంద్రబాబును కలిసేందుకు ఏ పార్టీ నేతలు కూడా ఇష్టపడటం లేదని… చంద్రబాబును కలవండి అంటూ టీడీపీ ఎంపీలు ఇతర పార్టీల నేతలను అడుక్కుంటున్నారని చెప్పారు.
రానున్న ఎన్నికల్లో వైసిపికి 150 సీట్లు ఖాయం అంటూ ధీమా వ్యక్తం చేశారు. చంద్రబాబునాయుడు అధికారాంతంలో ఉన్న విషయం తెలిసిపోతోందన్నారు. ఎన్నికలు ఎప్పుడు జరిగినా చంద్రబాబు అధికారంలోకి వచ్చే అవకావమే లేదని బల్లగుద్ది మరీ చెబుతున్నారు.
ఇంతకాలం కమ్యూనిస్టులు, పవన్, బిజెపిలను తన సైకిల్ కు చక్రాలలాగ చంద్రబాబు వాడుకున్నట్లు ఎద్దేవా చేశారు. ప్రస్తుతం ఆ చక్రాలన్నీ విడిపోతే కొత్త టైర్ల కోసం వెతుకునేందుకు ఢిల్లీకి వచ్చారట. ఎక్కడ యు టర్న్ కనిపించినా తనకు చంద్రబాబే గుర్తుకువస్తున్నట్లు చెప్పారు.