Thursday, May 2, 2024
- Advertisement -

టీడీపీ కండువా క‌ప్పుకోనున్న సీనియ‌ర్‌నేత‌

- Advertisement -

నంద్యాల ఉప ఎన్నికలకు ముందు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి గట్టి షాక్ త‌గిలింది. ఉప ఎన్నికల నేపథ్యంలో కర్నూలులో రసవత్తర రాజకీయం కనిపిస్తోంది. ఇప్ప‌టికే ఇరు పార్టీల అగ్ర‌నాయ‌క‌లు ప్ర‌చారంలో దూసుకుపోతున్నారు.తాజాగా వైసీపీకి పెద్ద దెబ్బే త‌గిలింది.

ఉప ఎన్నిక గెలుపుపై ఇరు పార్టీలు హోరాహోరీగా ప్ర‌చారాన్ని ముమ్మ‌రం చేశాయి. ప్ర‌ధానంగా వ‌ల‌స‌లు ప్రాధాన్య‌త సంత‌రించుకున్నాయి. అదికార పార్టీ నుంచి వైసీపీలోకి వ‌ల‌స‌లు వెల్తుంటె..తాజాగా వైసీపీనుంచి టీడీపీలోకి వ‌ల‌స‌లు ప్రారంభ‌మ‌య్యాయి. ఆ పార్టీ సీన‌యిర్‌నేత టీడీపీ తీర్థం పుచుకోనున్నారు.

క‌ర్నూలు జిల్లాలో మంచి ప‌ట్టున్న మాజీ ఎంపీ గంగుల ప్ర‌తాప్ రెడ్డి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీని వీడి టీడీపీలో చేరుతున్న‌ట్లు ప్ర‌క‌టించారు . ఈ రోజు టీడీపీ నేత అచ్చెన్నాయుడిని క‌లిసిన అనంత‌రం అమ‌రావ‌తిలోని స‌చివాల‌యంలో ఉన్న చంద్ర‌బాబు నాయుడి వద్ద‌కు ప్ర‌తాప్ రెడ్డి బ‌య‌లుదేరిన విష‌యం తెలిసిందే. ప్ర‌స్తుతం చంద్ర‌బాబు నాయుడితో గంగుల ప్ర‌తాప్ రెడ్డి, అచ్చెన్నాయుడు స‌మావేశ‌మై చ‌ర్చిస్తున్నారు. ఈ సంద‌ర్భంగా టీడీపీలో చేరుతున్న‌ట్లు ప్ర‌తాప్ రెడ్డి స్ప‌ష్ట‌త‌నిచ్చారు. దీంతో నంద్యాల‌లో వైసీపీకి మ‌రో ఎదురుదెబ్బ త‌గిలింది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -