Friday, May 3, 2024
- Advertisement -

పవన్ నువ్వు అలా చేస్తె నీకు పాదాభివందనం చేస్తా….పోసాని

- Advertisement -

పోలింగ్ దగ్గర పడుతున్న కొద్ది రాజకీయ విమర్శలు మరింత వేడెక్కుతున్నాయి. జనసేన అధినేత పవన్….వైసీపీ నేత పోసాని మురళీ మధ్య మాటల యుద్ధం ముదుురుతోంది. అనకాపల్లిలో జరిగిన బహిరంగ సభలో పవన్ మరో సారి జగన్ ను టార్గెట్ చేయడంపై పోసాని తీవ్రంగా స్పందించారు. ఏపీ రాజకీయాల్లో వేలు పెట్టొద్దని హైదరాబాద్ వేదికగా కేసీఆర్‌కు చెప్పానని, ఒకవేళ ఆయన ఆంధ్రాలో పోటీ చేయాలనుకుంటే ‘ఆంధ్రా రాష్ట్ర సమితి’ అని పార్టీ పెట్టి నిలబడండి. అంతేగానీ అడ్డదారిలో జగన్‌ను సీఎం చేస్తామంటే ఎలా అని పవన్ నిలదీశారు. జగన్‌పై పలు ఆరోపణలు చేస్తున్న పవన్ కళ్యాణ్, వాటిని నిరూపిస్తే, తాను ఆయన కాళ్లకు నమస్కరించి, పాలాభిషేకం చేస్తానని ఉద్ఘాటించారు.

జగన్ అవినీతిపై ఆధారాలు ఇస్తే, తన ఇంట్లోని జగన్ బొమ్మ తీసేసి పవన్ ఫోటోను పెట్టుకుంటానన్నారు. జగన్ చాలా గొప్ప వ్యక్తని, క్యారెక్టర్ ఉన్న మనిషని, ఆయనను పవన్ ఎందుకు విమర్శిస్తుననారో అర్థం కావడంలేదన్నారు. టీడీపీ అధినేత చంద్రబాబును విమర్శించకుండా జగన్ ను విమర్శించడం సరికాదన్నారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -