ఇప్పుడు ఏపీలో ఎవరి నోట విన్న నంద్యాల ఉప ఎన్నిక గురించే చర్చ. నంద్యాల ఉప ఎన్నికలు అనేది చాలా హీటెక్కి ఉంది. జగన్ భారీ బహిరంగ సభతో టీడీపీకి భయం పట్టుకున్నట్లు అయింది. బహిరంగ సభలో జగన్ ప్రసంగం టీడీపీ నేతలకు ఆగ్రహాన్ని బానే తెప్పిచింది. దాంతో జగన్ పై ఎలాగైన ఎదురు దాడి చేసేందుకు టీడీపీ నేతలంతా సిద్దం అవుతున్నారు.
అయితే అఖిల ప్రియ మరొ మెట్టెక్కి సంచలన వ్యాఖ్యాల చేశారు. తన తల్లి శోభా నాగి రెడ్డి ఎలా చనిపోయిందో జగన్ మరిచిపోయావా అంటూ ప్రశ్నించింది. మీ సోదరి షర్మిల కోసం వెళ్లి.. వస్తుండగా.. ప్రమాధం గురైందని… తన తల్లి షర్మిల కారణంగానే చనిపోయిందని ఓ రెంజ్ లో మండి పడింది. అధికారం దక్కించుకోవడం కోసం.. ఓట్ల కోసం మీరు మీ తండ్రి వైఎస్సార్ ఫోటో పెట్టి అడుకుంటే తప్పులేదు కానీ.. నా తల్లిదండ్రుల ఫోటో పెట్టుకోవటం తప్పా అంటూ ప్రశ్నించింది.
నా తల్లి శోభా నాగిరెడ్డిని వైఎస్ జగన్ మరిచిపోయాడని విమర్శించింది. జగన్ సోదరి షర్మిల కోసం వెళ్లి వస్తుండగా.. దుర్మరణం చెందిన శోభానాగిరెడ్డిని మరిచిపోవటం చాలా దారుణమని ఆవేదన వ్యక్తం చేసింది. ఎన్నికలను.. ఎన్నికల్లా చూడకుండా.. తమకు నచ్చినట్లు మాట్లాడం సరి కాదని.. అఖిల ప్రియ హితవు పలికింది.