2019 ఎన్నికల కాలం దగ్గర పడుతున్న నేపథ్యంలో కొత్త మంత్రి వర్గం టీమ్ను తయారు చేయబోతున్నారు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు. దీపావళి తర్వాత మరో సారి కేబినేట్ను ప్రక్షాలన చేయనున్నారనె వార్తలు మంత్రి వర్గంలో ప్రకంపనలు రేపుతున్నాయి. మంత్రి వర్గంలో ఎవరు ఉంటారో…. ఎవరి పేర్లు గల్లంతు అవుతాయోననె వార్తలు వినిపిస్తున్నాయి. ఏపీ మంత్రి వర్గంలో భారీ మార్పులు చోటుచేసుకోబోతున్నాయనె వార్తలు నేతల్లో అలజడి రేపుతున్నాయి.
మరో సారి మంత్రి వర్గ విస్తరణ ఏపీలో హాట్ టాపిక్గా మారింది. మంత్రివర్గ విస్తరణ జరిగి సంవత్సరం కూడా కాకుండానె మరోసారి మంత్రి వర్గ విస్తరణ చేయడంపై కొందరి మంత్రుల్లో ఆందోళన మొదలయితె… మరి కొందరు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. గతంలో జరిగిన మంత్రి వర్గ విస్తరనలో మంత్రి పదువులు రాని వారు ఆశలు పెట్టుకున్నారు.
ఇదంతా ఒక ఎత్తైతె … మరో షాకింగ్ వార్త కలకలం రేపుతోంది. మంత్రి వర్గ విస్తరణలో పర్యాటక శాఖ మంత్రి భూమా అఖిల ప్రియకు బాబు షాక్ ఇస్తారనె వార్తలు బలంగా వినిపిస్తున్నాయి… అయితే వచ్చే ప్రత్యక్షంగా ఎన్నికల్లో లోకేష్ గెలవలేడన్న సంగతి బాబుతోపాటు అందరికి తెలిసిదే. అందుకే సేఫ్జోన్ను వెతికి పెట్టారు..
అ నియేజవర్గం ఏదో కాదండోయ్.. చంద్రబాబు సొంత నియేజక వర్గం కుప్పం నుంచి లోకేష్ బరిలోదించి… బాబు నంద్యాల నియేజక వర్గాన్ని ఎంచుకున్నారన్న వార్తలు కూడ వినిపిస్తున్నాయి.
బాబు నంద్యాల నియేజక వర్గాన్నే ఎంచుకొని ఉండిఉంటే… ఇప్పటి నుంచే భూమ వర్గాన్ని దురం చేసుకోరు.. భూమ వర్గం మద్దతుంటే 2019 ఎన్నికల లో బాబు నంద్యాల నియేజక నుంచి గేలుపు ఎంతో సులభం.. అంతే కాకుండ భూమా బ్రహ్మానందరెడ్డికి ఎమ్యేల్సీ ఇచ్చే అవకాశం కూడ ఉంది. ఎలాంటి రాకీయ అనుభవం లేకపోయినా తల్లి మరణంతో ఎమ్మెల్యే…. తండ్రి మరణంతో మంత్రి పదవి సొంతం చేసుకున్న అఖిల ప్రియ మంత్రి పదవికి ఎలాంటి డోకాలేనట్టే అని చేప్పవచ్చు.