నంద్యాలప ఉప ఎన్నిక పోలింగ్కు రెండు రోజుల సమయం ఉండటంతో వైసీపీ అభ్యర్తి శిల్పాకు మద్దతు అంతకంతకూ పెరుగుతోంది. ఇప్పటికే ప్రచారంలో దూసుకుపోతున్న శిల్పా మరింత దూకుడు పెంచనున్నారు. ప్రజా మద్దతుతోపాటు వైసీపీకి సినిమాస్టార్స్ల ప్యాన్స్ మద్దతు పెరుగుతోంది. కొద్దిరోజుల క్రితం సుపర్స్టార్ కృష్ణ, మహేష్ బాబు ఫ్యాన్స్ పూర్తిగా మద్దతు తెలపడంతో పాటు శిల్పా గెలుపు కోసం తమ వంతు ప్రయత్నం చేస్తున్నారు.
ఇప్పుడు తాజాగా మరో స్టార్ హీరో అక్కినేని నాగార్జున ఫ్యాన్స్ అభిమానులు తమ మద్దతు శిల్పాకు తెలిపారు . ఎన్నికల్లో తాము శిల్పాకు సంపూర్ణ మద్దతిస్తున్నట్టు ఆలిండియా అక్కినేని నాగార్జున ఫ్యాన్స్ అసోసియేషన్ అధ్యక్షుడు రామరాజు తెలిపారు. నాగ్ అభిమానులంతా శిల్పాకు ఓటు వేయాలని, ఆయన్ను భారీ మెజారిటీతో గెలిపించాలని పిలుపునిచ్చారు.
ఉప ఎన్నికలో వైసీపీ అభ్యర్తి శిల్పా గెలుపు లాంఛనమే అన్న విషయం తేలిపోయింది. అన్ని సామాజిక వర్గాలనుంచి సంపూర్న మద్దతు లభించడంతో పార్టీ శ్రేణులు ఆనందంలో ఉన్నాయి. చంద్రబాబు సామాజికి వర్గానికే చెందిన మహేష్బాబు, నాగార్జుల ఫ్యాన్స్ శిల్పాకు ఓటు వేయడం వల్ల ఆ సామాజిక వర్గం ఓట్లన్ని చీలిపోతాయని బాబు అండ్ బ్యాచ్ ఆందోళన చెందుతున్నారు.
ఇప్పటికే టీడీపీ కాపులు, ఆర్యవైశ్యులు, బలిజ , ముస్లింలు, దిలితులు దూరమైన సంగతి తెలిసిందే. ఇప్పుడు మహేష్బాబు, అక్కినేని ఫ్యాన్స్ మద్దతు తెలపడంతో టీడీపీ ఓటమి ఖాయమనే రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది.