Sunday, April 28, 2024
- Advertisement -

నేను హర్ట్ అయ్యాను అంటున్న హోం మంత్రి.. అన్ని పిల్ల చేష్టలు..!

- Advertisement -

పంజాబ్​లో శాంతి భద్రతల పరిస్థితిపై హోంమంత్రిగా కూడా ఉన్న తనను నివేదిక కోరకుండా గవర్నర్​ ఉన్నతాధికారులను పిలవడాన్ని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి అమరీందర్​సింగ్​ తీవ్రస్థాయిలో ఆక్షేపించారు. బిజేపి పిల్ల చేష్టలకు గవర్నర్​ తలవంచడం దురదృష్టకరమని విమర్శించారు.

రాష్ట్రంలో మొబైల్​ టవర్ల విధ్వంసం వంటి చెదురుమదురు ఘటనల నేపథ్యంలో శాంతి భద్రతల సమస్యపై ప్రశ్నించేందుకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, డీజీపీలను గవర్నర్​ వీపీ సింగ్​ బద్నౌర్​ పిలవడంతో ముఖ్యమంత్రి స్పందించారు. వ్యవసాయ చట్టాలు, రైతుల ఆందోళన పరిణామాల నుంచి అందరి దృష్టిని మళ్లించేందుకు కేంద్రంలోని బిజేపి ప్రభుత్వం పంజాబ్​ శాంతిభద్రతల పరిస్థితులు దిగజారాయని దుష్ప్రచారం చేస్తోందని ఆరోపించారు.

ఒకవేళ శాంతిభద్రతల పరిస్థితిపై గవర్నర్​ నిజంగ ఆందోళన ఉంటే హోం మంత్రిత్వశాఖను కూడా చూస్తున్న తనతో చర్చించాలని అమరీందర్​ పేర్కొన్నారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -