వైసీపీ క్యాడర్ లో విపక్షాలపై విమర్శనాస్త్రాలు సంధించాలన్న, లేదా బూతులతో విరుచుకుపడాలన్న అంబటి రాంబాబు రూటే సపరేటు. ఎప్పుడు కూడా తనదైన రీతిలో విమర్శలు చేస్తూ విపక్షలను ఉక్కిరిబిక్కిరి చేస్తూ ఉంటాడు. అయితే ఆయన మాట్లాడే విధానం పట్ల ఇటు విపక్షాల నుంచి, అటు ప్రజల నుంచి తీవ్ర స్థాయిలో వ్యతిరేకత ఎదురవుతున్నప్పటికి అంబటి మాత్రం అసలు పట్టించుకోవడం లేదు. ఆ మద్య ప్రతిపక్ష నేత చంద్రబాబు పై అసెంబ్లీలో రాంబాబు చేసిన ఘాటు వ్యాఖ్యలు ఏ స్థాయిలో సంచలనం రేపాయే మనందరికి తెలిసిందే.
ఇవే కాకుండా ఆ మద్య పోన్ కాల్స్ లో బయటపడ్డ బూతు మాటలు, మాట్లాడే బాష విధానం అన్నీ కూడా ఆయన వైఖరి ఎలాంటిదో చెప్పకనే చెప్తున్నాయి. అయితే కేవలం అంబటి రాంబాబు మాత్రమే కాకుండా వైసీపీ క్యాడర్ లోని చాలమంది నేతల బాష విధానం కూడా అసభ్యకరంగానే ఉంటూ ఉండడం మనం చూస్తూనే ఉన్నాం. ఇక తాజాగా అంబటి రాంబాబు జనసేన అధినేత పవన్ కల్యాణ్ పై అలాగే టీడీపీ అధినేత చంద్రబాబుపై తనదైన రీతిలో విమర్శలు గుప్పించారు. చంద్రబాబును ఆయన సొంత నియోజిక వర్గం కుప్పంలో కచ్చితంగా ఓడించి తీరుతామని, సొంత పుత్రుడు లోకేష్ తో కలిసి వచ్చిన, దత్త పుత్రుడు పవన్ కల్యాణ్ తో కలిసి వచ్చిన బాబు ఓటమిని ఆపడం ఎవరి తరం కాదని అంబటి తనదైన రీతిలో విమర్శలు చేశారు.
చంద్రబాబు, పవన్ లు కలసి ఎన్ని కుట్రలు పన్నినా మళ్లీ జగన్ సీఎం అవుతారని, ఆయన్ను సీఎం కాకుండా అడ్డుకోవడం ఎవరి వల్లా కాదని అన్నారు అంబటి రాంబాబు. ఆయితే ఆయన మాటలు కాస్త అతిశయోక్తిగానే ఉన్నప్పటికి, ఆయన మాట్లాడే బాష విధానంలో ఎలాంటి మార్పు లేకపోవడం గమనార్హం. అంబటి చేసే వ్యాఖ్యలు ఎప్పుడు కూడా వాస్తవాలకు దూరంగా గాల్లో మేడలు కట్టే విధంగానే ఉంటాయని, ప్రజల్లో ఉన్న అభిప్రాయాన్ని ఎవరు కాదనలేని పరిస్థితి. గాల్లో మేడలు కట్టే మాటలను ఇంకెన్నాళ్ళు చెప్తావు రాంబాబు అంటూ ప్రజలు కూడా ఆయన చేసే వ్యాఖ్యలను లైట్ తీసుకుంటున్నారు.