Friday, May 17, 2024
- Advertisement -

ఆల్‌మోస్ట్ ఓడిపోతారు.. జేసీ వ్యాఖ్యలతో కలకలం

- Advertisement -

అనంతపురం ఎంపీ జేసీ దివాకర్‌ రెడ్డి తాజాగా చేసిన వ్యాఖ్యలు టీడీపీ ఎమ్మెల్యేల గుండెల్లో అలజడి రేపాయి. ఇప్పటికే జిల్లాలో అత్యధిక టీడీపీ నేతలకు వ్యతిరేకంగా మారిన జేసీ.. తాజాగా చేసిన వ్యాఖ్యలతో సిట్టింగ్‌ ఎమ్మెల్యేలందరికీ మంటపుట్టేలా చేశారు.

జిల్లాలో ఎంత మంది టీడీపీ సిట్టింగ్‌ ఎమ్మెల్యేలు మరోసారి గెలుస్తారని మీడియా ప్రశ్నించగా… ఓ ముగ్గురు గెలిచే అవకాశం ఉందని జేసీ వ్యాఖ్యానించారు. మిగిలిన వారంతా ఓడిపోతారని తేల్చేశారు. ఈ విషయాన్ని చంద్రబాబుకు కూడా తాను చెప్పానన్నారు. కొత్త అభ్యర్థులుగా ఎవరైతే బాగుంటుందో జాబితాను కూడా ఇచ్చానని జేసీ చెప్పారు.

జేసీ వ్యాఖ్యలపై సిట్టింగ్‌లు భగ్గుమంటున్నారు. 14 స్థానాలున్న అనంతపురం జిల్లాలో ఒక ఫిరాయింపు ఎమ్మెల్యేతో కలుపుకుంటే 13 మంది టీడీపీ సిట్టింగ్‌ ఎమ్మెల్యేలే. వీరిలో కేవలం ముగ్గురు మాత్రమే గెలుస్తారని జేసీ చెప్పడం బట్టి టీడీపీ పరిస్థితి ఇంత దయనీయంగా ఉందా అన్న చర్చజరుగుతోంది. పైగా టీడీపీకి గట్టి పట్టున్న జిల్లాగా భావిస్తున్న అనంతపురం జిల్లాలోనే పరిస్థితి ఇలా ఉంటే ఇక మిగిలిన చోట్ల డ్యామేజ్ మరింత ఎక్కువగా ఉంటుందనిఆందోళన చెందుతున్నారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -