Sunday, May 12, 2024
- Advertisement -

రాహుల్‌ గాంధీతో బాబు భేటీ…

- Advertisement -

బీజేపీయేతర పార్టీలతో ఫ్రంట్ ఏర్పాటు కోసం మరోసారి ఏపీ సీఎం చంద్రబాబునాయుడు ప్రయత్నాలను ముమ్మరం చేశారు. సరిగ్గా 20 ఏళ్ల తర్వాత బీజేపీయేతర పార్టీలతో కూటమి కోసం బాబు వ్యూహత్మకంగా అడుగులు వేస్తున్నాడు. దీనిలో భాగంగానే ఇవాల రాహుల్ గాంధీతో స‌మావేశ మ‌య్యారు.చంద్రబాబు వెంట ఎంపీలు గల్లా జయదేవ్, కనకమేడల, సీఎం రమేష్, కంభంపాటి రామ్మోహన్ తదితర నేతలు ఉన్నారు

దేశంలోని రాజకీయ పరిస్థితులతో పాటు తెలుగు రాష్ట్రాల రాజకీయాల మీద కూడా వారు చర్చించనున్నారు. ఇప్పటికే శరద్ పవార్, ఫరూక్ అబ్దుల్లాతో నిర్వహించిన సమావేశంలో ‘సేవ్ డెమొక్రసీ – సేవ్ నేషన్’ అనే నినాదాన్ని అందుకున్నారు.

బీజేపీ వ్యతిరేక పార్టీలను ఏకతాటిపైకి తీసుకొచ్చే దిశగా చర్చలు సాగుతున్నాయి. తెలంగాణలో సీట్ల సంపకాలపై కూడా చర్చ జరిగే అవకాశం ఉంది. సాయంత్రం 6 గంటలకు మీడియా సమావేశంలో చంద్రబాబు అన్ని వివరాలను వెల్లడించనున్నారు

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -