ఏపీలో దాదాపు వైసీపీ అధికారంలోకి వస్తుందనే విషయం తేలిపోయింది. ఇప్పటికే ప్రాంతీయ, జాతీయ సర్వేలు జగన్ ముఖ్యమంత్రి కావడం ఖాయమని తేల్చి చెప్పాయి.అయితే మోదీ దగ్గర ఆంధ్రప్రదేశ్కు సంబంధించిన తాజా ఇంటలిజెన్స్ సమాచారం చేరిందంట. అది కూడా మోదీనే స్వయంగా పంపించిన నిఘా వర్గాలు. వచ్చే ఎన్నికల్లో వైసీపీ క్లియర్ మెజారిటీతో విజయం సాధించడం ఖాయమని వైఎస్ జగన్ సీఎం కావడం ఖాయమని కూడా తేలిందట.
ఇక ఎన్డీఏ ప్రభుత్వానికి ఈసారి పూర్తి మెజారిటీ రాదని సర్వేలు స్పష్టం చేస్తున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో ప్రాంతీయ పార్టీల మద్దతు కశ్చితంగా అవసరం. రాష్ట్రంలో మొత్తం 25 సీట్లు ఉంటే… వాటిలో 15- 20 సీట్లను గెలుచుకుంటుందంది నిఘా వర్గాలతో పాటు జాతీయ సర్వేలు స్పష్టం చేశాయి.
కేంద్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందకు పూర్తి మెజారిటీ రాకపోతే జగన్ను ఏదొక విధంగా తన దారికి తెచ్చుకొనేందుకు మోదీ ప్రయత్నాలు మొదలు పెట్టినట్లు సమాచారం. మరో వైపు ప్రత్యేకహోదా ఇస్తామని ఎవరు సంతకం చేస్తే వారికే తమ మద్దతు ఇస్తానని ఇప్పటికే జగన్ అనేక సార్లు ప్రకటించారు. మరి ప్రత్యేక హోదా ఇస్తామని జగన్తో దోస్తీ కడతారా లేకా ఏదొక విధంగా తన దారికి తెచ్చుకుంటారో చూడాలి. ఇక కేంద్రంలో ఎన్డీఏ మెజారిటీకీ కొద్ది దూరంలో ఆగిపోతే మాత్రం ప్రత్యేక హోదా ప్రకటించడం మినహా మరోకటి ఉండదు. మోదీ ద్వయం ఏంచేస్తుందో మరి.