ఎన్నికల ప్రచారంలో వైఎస్ జగన్ మాటలు ప్రత్యర్థుల గుండెల్లో తూటాల్లా పేలుతున్నాయి. జగన్ సంధిస్తున్న బాణాలకు జనసేన, టీడీపీ ల దగ్గర సమాధానాలు లేకా ఎదురుదాడికి దిగుతున్నారు. తాజాగా ఎన్నికల ప్రచారంలో భాగంగా పాలకొల్లులో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో బాబు, పవన్లు చేస్తున్న వ్యాఖ్యలకు ధీటుగా కౌంటర్ ఇచ్చారు జననేత.
గత కొన్ని రోజులుగా ఎన్నికల ప్రచారంలో పవన్, జగన్ మధ్య మాటల యుద్ధం తారాస్థాయికి చేరింది. అధికారంలో ఉన్న టీడీపీని ప్రశ్నించకుండా ప్రతిపక్ష పార్టీ అయిన వైసీపీనీ టార్గెట్ చేయడం పవన్కు అలవాటుగా మారింది.గత సార్వత్రిక ఎన్నికలలో తెలుగుదేశం కూటమికి మద్దతిచ్చిన పవన్….అధికారంలో టీడీపీ వస్తే అవినీతికి పాల్పడితే చంద్రబాబు కాలర్ పట్టుకుని ప్రశ్నిస్తాను అని ప్రజలకు వాగ్దానం చేసిన సంగతి తెలిసిందే. అనుకున్నట్లుగానే టీడీపీ కూటమి అధికారంలోకి వచ్చింది. నాలుగు సంవత్సరాలు టీడీపీ కూటమితో అంటకాగిన పవన్ పొగడ్తల వర్షం కురిపించి తరువాత టీడీపీనుంచి సైడ్ అయ్యారు.
ఇదిలావుండగా ప్రస్తుతం మన రాష్ట్రంలో ఎన్నికలు జరగనున్న క్రమంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్..రాష్ట్రాన్ని అవినీతిమయం చేసిన అధికార పార్టీని టిడిపిని నిలదీయకుండా….ప్రజల తరుపున పోరాటం చేస్తున్న జగన్ను టార్గెట్ చేయడం అందర్నీ ఆశ్చర్యపరుస్తోంది. ఈ క్రమంలో పవన్ చేసిన వ్యాఖ్యలకు మరో సారి నోరెత్తకుండా పవన్కు ఘాటు కౌంటర్ ఇచ్చారు.
సీఎం స్థాయిలో ఉన్న చంద్రబాబు రాష్ట్రాన్ని అడ్డగోలుగా దోచుకుంటున్న.. వ్యవస్థలన్నింటినీ నాశనం చేస్తుంటే..చంద్రబాబు పార్ట్నర్ పవన్ కళ్యాణ్ నన్ను ప్రశ్నించడం చాలా ఎటకారం గా ఉందని… జగన్ ఇటీవల పవన్ కళ్యాణ్ తనపై చేసిన వ్యాఖ్యలకు కౌంటర్ వేశారు.
వైఎస్ వివేకానందరెడ్డి హత్య పై పవన్ చేస్తున్న వ్యాఖ్యలకు ధీటైన సమాధానం ఇచ్చారు. చంద్రబాబుగారి పార్టనర్, ఒక యాక్టర్ చంద్రబాబు కుట్రలో భాగమై విలువలన్నీ మర్చిపోయి, ఆయన ఏం చెబితే అదే చేస్తున్నారంటూ పవన్ కల్యాణ్పై విమర్శనాస్త్రాలు సంధించారు. మీ కుటుంబంలో ఒకరిని బాబు హత్య చేయించి… మీరే ఆ పని చేశారు అని ఆరోపిస్తే మీకు నచ్చుతుందా? అప్పుడు కూడా ఆయన ఇలానే మాట్లాడతారా..?’ అని ప్రశ్నించారు. మరి జగన్ సంధించిన ప్రశ్నకు పవన్ దగ్గర సమాధానం ఉందా…? ఉంటె జగన్ చేసిన వ్యాఖ్యలకు పవన్ ఎలా సమాధానం ఇస్తారో చూడాలి.