పవన్ కల్యాణ్ దెబ్బకు బాబు మైండ్ బ్లాక్ అయినట్లుంది. ఇన్నాల్లు వెనుకేసుకొచ్చిన పవన్ ఒక్కసారిగా రివర్స్ అవడంతో చంద్రబాబుకు ఆత్మరక్షణలో పడ్డారు. అవిశ్వాసతీర్మానం చర్చకు వచ్చేలా పట్టుబట్టాలని విధంగా టెలికాన్ఫరెన్స్ ద్వారా ఎంపీలకు సూచించారు. పవన్పై కూడా విమర్శలు గుప్పించారు.
పవన్ కల్యాణ్ తెలుగుదేశం పార్టీని, తన కుటుంబంపై నిరాధార ఆరోపణలతో ఇంత డ్యామేజ్ చేస్తారని ఎన్నడూ అనుకోలేదని ఏపీ సీఎం చంద్రబాబునాయుడు వ్యాఖ్యానించారు. డబ్బుల కోసమే పోలవరం ప్రాజెక్టు నిర్మిస్తున్నామనడం సరికాదని.. బీజేపీ, వైసీపీ, జనసేన పార్టీల మన ఖ్యాతిని దెబ్బతీయడానికి ప్రయత్నిస్తున్నాయని సీఎం ఎంపీలకు వెల్లడించారు. బీజేపీకి కోవర్టులుగా జగన్, పవన్ పనిచేస్తున్నారని ఆరోపించారు. బీజేపీ ఏం చెబితే పవన్ అదిస్తేన్నారని, పవన్ బాగా తిట్టాడని ఏపీ బీజేపీ అధ్యక్షుడు హరిబాబూ కూడా అంటున్నారని చంద్రబాబు గుర్తుచేశారు.
తెలుగు ప్రజలు ఎంతో అభిమానించే నటుల్లో ఒకరైన పవన్ ఇటువంటి విమర్శలు చేస్తే, నమ్మేవారు కొందరైనా ఉంటారని, అది ప్రభుత్వాన్ని అప్రదిష్ట పాలు చేస్తుందని అన్నారు. ఇంతకాలం నిత్యమూ వైసీపీ నేతలు ప్రభుత్వాన్ని, తనను లక్ష్యంగా చేసుకుని విమర్శిస్తూ, ఇమేజ్ ని డ్యామేజ్ చేస్తుండేవారని, ఇప్పుడు ఆ పార్టీకి బీజేపీ, జనసేన కూడా కలిశాయని చంద్రబాబు ఆరోపించారు.