జనసేన అధినేత పవన్ కల్యాణ్ పై విమర్శలు గుప్పించారు ఏపీ సీఎం జగన్. వీలు చిక్కినప్పుడల్లా టీడీపీ అధినేత చంద్రబాబుతో పాటు పవన్ కల్యాణ్ పై విమర్శలు గుప్పిస్తూ వస్తున్న జగన్..తాజాగా ప్రభుత్వ కార్యక్రమాన్ని ప్రత్యర్థులపై విమర్శనాస్త్రాలు ఎక్కుపెట్టేందుకు వేదికగా చేసుకున్నారు. ఏలూరు జిల్లా గణపవరంలో రైతు భరోసా కింద నిధుల విడుదల కార్యక్రమం సందర్భంగా ఏర్పాటు చేసిన బహిరంగ సభలో జగన్ మాట్లాడారు.
చంద్రబాబు దత్తపుత్రుడు ఇటీవల రైతులను పరామర్శించేందుకు బయలుదేరారనీ.. కానీ సీసీఆర్సీ కార్డు, పట్టాదారు పాసుపుస్తకం ఉండి ఆత్మహత్య చేసుకున్న ఏ ఒక్క రైతుకూ పరిహారం దక్కలేదని చూపలేకపోయారన్నారు. గత ప్రభుత్వంలో రైతులకు అన్యాయం జరిగినప్పుడు ఆయన ఎందుకు ప్రశ్నించలేదన్నారు.
రుణమాపీ చేస్తానన్న చంద్రబాబు మాట తప్పారనీ.. అప్పుడు ప్రశ్నించాల్సింది పోయి.. ప్రశ్నించకుండా చంద్రబాబుపై దత్తపుత్రుడు ప్రేమ చూపించాడన్నారు. మరోవైపు 50.10 లక్షల మందికి ఏపీ ప్రభుత్వం రైతుభరోసా కింద పంట సాయం అధించింది. ఇప్పటివరకు ఈ పథకం కింద 23 వేల 875 కోట్ల రూపాయలు ఇచ్చామని సీఎం జగన్ చెప్పారు.
కేసీఆర్ కు నివేదిక ఇవ్వబోతున్న పీకే
ఏపీ మంత్రిపై అయ్యన్నపాత్రుడు సంచలన ఆరోపణలు
ఒకే కుటుంబం నుంచి ఒక్కరికే టికెట్
-Ramesh Reddy Chilakala