Sunday, May 5, 2024
- Advertisement -

సినిమాల్లో ప‌వ‌ణ్ సిల్లీ క్యారెక్ట‌ర్‌లాంటోడు..విజ‌య‌సాయి గ‌లీజు వ్య‌క్తి..మంత్రి ఆది

- Advertisement -

వైసీపీ, టీడీపీ నేత‌ల మ‌ధ్య మాట‌ల‌యుద్ధం తారాస్థాయికి చేరింది. సీఎం చంద్ర‌బాబు, మంత్రుల‌పై వైసీపీ ఎంపీ విజ‌య‌సాయిరెడ్డి చేసిన ఆరోప‌న‌లు తెలిసిందే. తాజాగా జనసేన అధినేత పవన్ కల్యాణ్, వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డిలపై ఏపీ మంత్రి ఆదినారాయణరెడ్డి స్పందించారు.

సినిమాల్లో సిల్లీ క్యారెక్టర్ లాంటి వ్యక్తి పవన్ కల్యాణ్ అని ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఆయన వ్యవహారశైలి ఆయనకే అర్థం కావడం లేదని అన్నారు. విజయసాయి రెడ్డి నీచాతినీచంగా మాట్లాడుతున్నారని మంత్రి మండిపడ్డారు. స్వలాభం కోసం సంస్కార హీనంగా వ్యవహరిస్తున్నారని అన్నారు. బెంగళూరులో తన పెద్దల పేరుతో తాను ట్రస్ట్ ను నిర్వహిస్తుంటే… క్లబ్ నడుపుతున్నానంటూ తప్పడు ఆరోపణలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తన ట్రస్ట్ ద్వారా ఎన్నో సేవా కార్యక్రమాలను చేస్తున్నానని చెప్పారు. తనపై చేసిన ఆరోపణలు విజయసాయి నిరూపిస్తే… ఉరి వేసుకుంటానని సవాల్ విసిరారు.

విజయసాయి గలీజు, గబ్బు వ్యక్తి అని అన్నారు. విజయసాయి చరిత్రే గబ్బు అని చెప్పారు. ఆయనకు మతి భ్రమించిందని, అందుకే గతి తప్పాడని చెప్పారు. కేసుల నుంచి బయటపడేందుకు ప్రధాని మోదీ కాళ్లు పట్టుకున్నారని… కాళ్లు పట్టుకున్నా దేవుడు కూడా అతన్ని కాపాడలేడని అన్నారు. తప్పుడు లెక్కలు, దొంగ కంపెనీలు పెట్టడంలో విజయసాయి దిట్ట అని చెప్పారు.

రాష్ట్రానికి ఎంతో చేస్తామని చెప్పిన కేంద్ర ప్రభుత్వం… చివరకు పిండాకూడు మెతుకులు వేసిందని మండిపడ్డారు. బీజేపీలో బీ అంటే బీజేపీ, జే అంటే జగన్, పీ అంటే పవన్ కల్యాణ్ అని ఎద్దేవా చేశారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -