Monday, May 6, 2024
- Advertisement -

ఉప ఎన్నిక ప్ర‌చారంలో మ‌రో కొత్త బాంబు పేల్చిన మంత్రి అఖిల ప్రియ‌

- Advertisement -

నంద్యాల ఉప ఎన్నికల ప్ర‌చారంలో అధికార పార్టీ నేత‌ల నోటి నుంచి కొత్త కొత్త మాట‌లు వినిపిస్తున్నాయి. తాజాగా మంత్రి అఖిలప్రియ చేసిన వ్యాఖ్యలు ఆశ్య‌ర్యానికి గురి చేస్తున్నాయి. త‌న తండ్రి భూమా నాగిరెడ్డి మ‌ర‌ణానికి శిల్పామోహ‌న్ రెడ్డే కార‌న‌మ‌ని మ‌రో కొత్త బాంబు పేల్చారు. అఖిల మాట్లాడిన పది నిముషాల్లో భూమా మరణం, భూమా మరణమంటూ పదే పదే సెంటిమెంటును రగిల్చే ప్రయత్నం చేసారు.

గ‌తంలోకి వెల్తే ప‌ర్య‌టాల ర‌విని చంపించింది వైఎస్ జగన్ మోహన్ రెడ్డి, జేసీ దివాకర్ రెడ్డిలే అని తెగ బాధ‌ప‌డిపోయారు సునీత‌. కట్ చేస్తే.. ఇప్పుడు పరిటాల సునీత, జేసీ దివాకర్ రెడ్డిలు భాయీభాయీ. ఇప్పుడు తన భర్త హత్య గురించి మాట్లాడితే.. జేసీ పేరును తీసేసి జగన్ మాత్రమే హత్య చేయించాడనేది ఆమె మాట. వెనుకటికి చంద్రబాబు కూడా జేసీ, జగన్ లు కలిసి పరిటాల రవిని హత్య చేయించారని అనేవాడు. మరి కట్టుకున్న భర్త విషయంలో సునీత అవసరాన్ని బట్టి పేర్లను మారుస్తుండటం ఇప్పటికీ సీమ జనాల్లో ఆశ్చర్యాన్ని కలిగిస్తూ ఉంటుంది.

ఇప్పుడు సీనీత స‌ర‌స‌న మంత్రి అఖిల ప్రియ చేరారు. అఖిల తాజాగా తన తండ్రి నాగిరెడ్డి మరణానికి కారణం శిల్పా మోహన్ రెడ్డేనట! భూమా నాగిరెడ్డి మరణానికి కారణం అయిన శిల్పా మోహన్ రెడ్డికి జగన్ టికెట్ ఇచ్చాడట. అందుకే వారికి బుద్ధి చెప్పాలని ఈమె నంద్యాల జనులకు పిలుపునిచ్చింది.

అఖిల మ‌తి ఉండే మాట్లాడుతుందా అన్న వ్యాఖ్య‌లు వినిపిస్తున్నాయి. గ‌తంలో ‘నా తండ్రికి ఏమైనా అయితే దానికి చంద్రబాబే కారణం..’ అని అనలేదా.. అలా అన్న ఈమె, ఇప్పుడు చంద్రబాబుకు పక్కన నిలబడి.. శిల్పా మోహన్ రెడ్డే తన తండ్రి మరణానికి కారణం.. అని అంటుంటే, ఆశ్చర్యం కాదు.. విస్మయం కలుగుతుంది. మ‌రీ ఇంత నీచానికి దిగ‌జారారా మంత్రిగార‌ని నంద్యాల ప్ర‌జ‌లు అనుకుంటున్నారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -