నంద్యాల ఉప ఎన్నిక పోలింగ్ దగ్గర పడుతున్న వేల అఖిల ప్రియకు సంబందించి ఓ ఫేస్బుక్ పోస్ట్ ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా సోషియల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. ఈ పోస్ట్ తన మనసులో మాటను అఖిల ప్రియ మరోసారి బయటపెట్టిందనె వార్తలు వినిపిస్తున్నాయి. తాజాగా గంగుల ప్రతాప్ రెడ్డి టీడీపీలోకి బాబు చేర్చుకోవడంతో మంత్రి అఖిల తీవ్ర మనస్తాపానికి గురయిన సంగతి తెలిసిందే. ఈవిషయం తెలిసిన వెంటనె ఎన్నికల ప్రచారం నుంచి అర్దాంతరంగా తప్పుకుంది. అయితే అఖిల పేస్బుక్లో పోస్ట్ అయిన వార్త ఇప్పుడు టీడీపీలో తీవ్ర కలకలాన్ని రేపుతోంది.
ఆమె తన మనోవేదనను వ్యక్తం చేస్తూ తన ట్విట్టర్ ఖాతాలో ఓ పోస్ట్ చేసినట్టు సమాచారం. ఈనెల 17వ తేదీన సాయంత్రం 5.14 నిమిషాలకు ఈ పోస్ట్ చేయగా, ఇపుడు ఇది ఆ ఖాతాలో కనిపించక పోవడం గమనార్హం. అఖిల భూమా ట్విట్టర్ ఖాతాలో ఈ పోస్ట్ ఉంది. ఈ పోస్ట్లో….
“చంద్రబాబు నాయుడిని నమ్మడం నా మతిలేని తనం. గంగులను పార్టీలోకి రానిచ్చి ఆయన మా నాన్నగారు స్వర్గీయ భూమా నాగిరెడ్డికి నమ్మక ద్రోహం చేశారు. ఎన్నికల కోసం మా కుటుంబాన్ని వాడుకుందామని చూశారు. ఇకపై నేను టీడీపీకి ప్రచారం చేయనని మా నాన్నగారి సాక్షిగా చెబుతున్నాను. మా కుటుంబం శ్రేయోభిలాషులైన మీ అందరికీ ఇదే నా విన్నపం… దయచేసి మన నంద్యాల ఉప ఎన్నికల్లో టీడీపీని బహిష్కరించండి” అని ఉంది. ఇది సోషల్ మీడియాలో వైరల్గా మారింది.
దీన్ని పోస్ట్ చేసిన 2 గంటల్లోనే డిలీట్ కావడం గమనార్హం. మరోవైపు భూమా అఖిలప్రియా ఖాతా మాత్రం భూమా అఖిలా రెడ్డి పేరుతో ఉండటం ఇపుడు చర్చనీయాంశంగా మారింది. నిజంగా అఖిలే ఈ తరహా పోస్ట్ చేశారా? లేక ఎవరైనా ప్రత్యర్థులు నకిలీ ఖాతా సృష్టించి ఈ పోస్ట్ చేశారా? అన్నది తెలియాల్సి ఉంది. ఇదే జరిగితె ఉప ఎన్నిక తర్వాత అఖిల ప్రియ తన దారి తాను చూసుకుంటా దనడంలో సందేహం లేదనిపిస్తోంది.