Saturday, May 18, 2024
- Advertisement -

ప‌వ‌న్ డ్రామాలొద్దు…నారా లోకేష్‌

- Advertisement -

జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ వ్యాఖ్య‌ల‌కు కౌంట‌ర్ ఇచ్చారు మంత్రి నారాలోకేష్‌. కేంద్రం తీరుకు నిరసనగా ఏపీ ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు విజ‌య‌వాడ‌లో జెండా ఊపి ఈ సైకిల్ యాత్రను ప్రారంభించారు. ఈ యాత్ర‌లో పార్టీశ్రేణులు,నేత‌లు త‌దిత‌రులు పాల్గొన్నారు.

వెంకటపాలెం నుంచి ఏపీ అసెంబ్లీ వరకూ జరిగిన యాత్రలో సైకిల్ తొక్కారు మంత్రి లోకేష్ పాల్గొన్నారు. రాష్ట్ర విభజన ప్రజలు కోరుకున్నది కాదని ఆనాడు కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్రాన్ని ముక్కలు చేసిందని ఆరోపించారు. అనంతరం జరిగిన పరిణామాలతో ఎన్టీఏ పార్టీ అధికారం చేపట్టిందన్నారు.

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ప్రత్యేక హోదా కోసం చేపట్టిన పాదయాత్రపై కూడా స్పందించారు. రాష్ట్ర ప్రయోజనాల కోసం ఎవరు ముందుకు వచ్చినా ఆహ్వానిస్తాం అన్నారు. అయితే ఐవైఆర్ క్రిష్ణారావు రచించిన ‘ఎవరికి రాజధాని అమరావతి’ పుస్తక ఆవిష్కరణలో పవన్ చేసిన వ్యాఖ్యలు రాష్ట్రానికి చేటు కలిగించేవిగా ఉన్నాయన్నారు. పుస్తక ఆవిష్కరణ కార్యక్రమంలో పవన్ కళ్యాణ్ రాజధానికి వ్యతిరేకంగా మాట్లాడారు ఇలా మాట్లాడితే రాష్ట్రాలకు పెట్టుబడులు ఎలా వస్తాయి. హోదా, రాజధాని పేరుతో డ్రామాలు ఆడటం కరెక్ట్ కాదంటూ ప‌వ‌న్‌కు హితవు పలికారు మంత్రి లోకేష్.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -