పవన్పై జగన్ చేసిన వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చారు జనసేన అధినేత పవన్. ఒకరి మీద ఒకరు చేసుకున్న విమర్శలు రాష్ట్రవ్యాప్తంగా ఎంత దుమారాన్ని రేపాయో అందరికీ తెలిసిందే. వైసీపీ, జనసేన అభిమానుల మధ్య ఇప్పటికీ సోషియల్ మీడియాలో మాటల యుద్ధం జరుగుతోంది. తాజాగా ఏపీ కాంగ్రెస్ ఛీప్ రఘువీరా పవన్కు మద్దతు తెలిపారు.పవన్ కల్యాణ్ పై జగన్ వ్యాఖ్యలను ఆయన ఖండించారు. రాజకీయాల్లో ఉన్న నేతలు వ్యక్తిగత విమర్శలకు దిగడం దారుణమని అన్నారు.
రాజకీయాల్లో ఉన్న నేతలు వ్యక్తిగత విమర్శలకు దిగడం దారుణమని.. జగన్ అలా అని ఉండాల్సింది కాదని వ్యాఖ్యానించారు.. బీజేపీకి టీడీపీ, వైసీపీ రెండు కళ్లని.. బీజేపీ ఆడిస్తున్న విధంగా టీఆర్ఎస్ ఆడుతోందని మండిపడ్డారు.
25 ఎంపీ సీట్లను తమ చేతిలో పెడితే ప్రత్యేక హోదాను సాధిస్తామని టీడీపీ, వైసీపీలు చెబుతున్నాయని… 2014లో అన్ని సీట్లను ఆ రెండు పార్టీల చేతిలోనే ఏపీ ప్రజలు పెట్టారని… అయినా, ఆ పార్టీలు చేసిందేమీ లేదని రఘువీరా ఎద్దేవా చేశారు.
కమలనాథుల డ్రామాలో భాగంగానే ఏపీకి ప్రత్యేకహోదా ఇస్తే.. తెలంగాణకు కూడా ఇవ్వాలని ఆ పార్టీ పట్టుబడుతోందని ఆరోపించారు.. కాంగ్రెస్, టీడీపీలు పొత్తు పెట్టుకుంటాయనే వార్తల్లో నిజం లేదన్నారు. ఇటీవల ముగిసిన సీడబ్ల్యూసీ సమావేశంలో తాము అధికారంలోకి వస్తే ఏపీకి ప్రత్యేకహోదా ఇస్తామని కాంగ్రెస్ తీర్మానం చేసిందని.. ఇది సంతోషకరమని చెప్పారు.