వైసీపీ అధినేత జగన్ మోహన్రెడ్డిపై మొదటినుంచి పార్టీ ఫిరాయించిన నేతలపై అనర్హత వేటు వేయాలని డిమాండ్ చేస్తున్న సంగతి తెలిసిందె. ఫిరాయింపులపై చర్యలు తీసుకోకపోవడంతో ఏకంగా అసెంబ్లీ సమావేశాలను బహిస్కరించారు జగన్. ఎందుకు సమావేశాలను బహిస్కరించామో తెలుపుతూ రాష్ట్రపతికి లేఖరాయడం చర్చనీయాంశంగా మారింది. అయితె జగన్ రాసిన లేఖపై మంత్రి అఖిలప్రియ మండిపడ్డారు.
మేము రాజీనామ చేసేందుకు సిద్ధంగా ఉన్నామని అఖిలప్రియ తాజాగా కర్నూలులో ప్రకటించారు. అభివృద్ధికోసమే మేము టీడీపీలో చేరామని…అది జీర్నించుకోలేని వైసీపీ విమర్శలు చేస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. మేము రాజీనామా చేసి ఎన్నికలకు వెల్లినా నంద్యాల ఫలితమే పునరావృతం అవుతందని స్పష్టం చేశారు.
నంద్యాల, ఆళ్లగడ్డ ప్రజలు వైసిపిని, ఆ పార్టీ అధినేత జగన్ను చూసి ఓటేయలేదని అఖిలప్రియ షాకింగ్ కామెంట్స్ చేశారు. తమ కుటుంబాన్ని, భూమా నాగిరెడ్డిని చూసి ఓటు వేశారని స్పష్టం చేశారు. ప్రజా సమస్యలపై చర్చించేందుకు అసెంబ్లీ మంచి వేదిక అన్నారు. ఇప్పుడు బహిష్కరణ ద్వారా వైసిపి మంచి అవకాశం కోల్పోయిందన్నారు.