Thursday, May 2, 2024
- Advertisement -

గంగుల వర్సెస్ భూమా… గెలుపెవరిదో?

- Advertisement -

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ రాజకీయాల్లో ఆ నియోజకవర్గంది ప్రత్యేక స్థానం. అక్కడి నుండి ఎవరు గెలుస్తారా అన్న దానిపై ఎప్పుడు ఉత్కంఠే. అదే ఆళ్లగడ్డ. గంగుల వర్సెస్ భూమాగా ఇక్కడి పాలిటిక్స్ దశాబ్దాలుగా సాగుతున్నాయి. గత ఎన్నికల్లో భూమా ఫ్యామిలీ ఆధిపత్యానికి గండి కొడుతూ విజయం సాధించారు గంగుల బ్రిజేంద్రకుమార్ రెడ్డి. ఇప్పుడు తాజాగా భూమా ఫ్యామిలీ నుండి అఖిల ప్రియ, గంగుల ఫ్యామిలీ నుండి బ్రిజేంద్రకుమార్ మరోసారి తలపడుతున్నారు.

వాస్తవానికి ఆళ్లగడ్డలో గంగుల ఫ్యామిలీ వర్సెస్ భూమా ఫ్యామిలీ మధ్య ఎన్నో సంవత్సరాలుగా ఆధిపత్య పోరు నడిచింది. ముఖ్యంగా గంగుల ప్రభాకర్ రెడ్డి వర్సెస్ భూమా నాగిరెడ్డి, శోభా నాగిరెడ్డికి సాగిన పోరు ఇప్పుడు వారి వారసుల మధ్య నడుస్తోంది. ఎన్నికలు సమయం దగ్గరపడుతుండటంతో ఆళ్లగడ్డలో మళ్లీ వేడి రాజుకుంది.

ఒకరిపై మరోకరు మాటల యుద్ధంతో తీవ్ర విమర్శలు చేసుకుంటున్నారు. ఇక గంగుల కుటుంబం మరోసారి వైసీపీ జెండా ఎగరేసేందుకు విశ్వప్రయత్నాలు చేస్తుండగా అఖిల ప్రియకు మాత్రం సొంత పార్టీలోనే వ్యతిరేకత తయారైంది. ఏవీ సుబ్బారెడ్డితో గొడవలు, అన్న కిషోర్ కుమార్ రెడ్డితో వైరం ఇబ్బందికరంగా మారింది. ఇక జనసేన తరపున ఇరిగెల రాంపుల్లారెడ్డి సైతం ఆళ్లగడ్డ సీటు ఆశీస్తుండటంతో ఆమె ఒంటరిగానే తలపడే అవకాశం ఉంది. ఇన్ని ప్రతికూలతల మధ్య అఖిల ప్రియ ఎన్నికల రణక్షేత్రాన్ని ఏ విధంగా ఎదుర్కుంటారు అన్నది ప్రశ్నార్ధకంగా మారింది. మొత్తంగా ఆళ్లగడ్డ వార్‌లో గెలిచేది ఎవరు అన్న దానిపై మాత్రం సస్పెన్స్ కొనసాగుతూనే ఉంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -