Friday, March 29, 2024
- Advertisement -

అలాంటి వారి చేతులు నరకాలి : ఎమ్మెల్యే బాలకృష్ణ

- Advertisement -

ఆంధ్రప్రదేశ్‌లో వరుసగా హిందూ ఆలయాలపై దుండగులు దాడులు చేస్తూ విగ్రాహాలను ధ్వంసం చేస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో అధికార పార్టీపై ప్రతిపక్ష నేతలు దుమ్మెత్తి పోస్తున్నారు. అసలే కరోనాతో ప్రపంచం వినాశనం అవుతుంటే.. ఇప్పుడు ఇలా విగ్రహాల ధ్వంసం వినాశనానికి దారి తీస్తుందని హిందువుల ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తాజాగా హిందూపురంలో పర్యటిస్తున్న ఆయన మీడియాతో మాట్లాడుతూ.. విగ్రాహాలను ధ్వంసం చేస్తున్న వారి చేతులు ఖండించాలన్నారు.

ఇప్పటి వరకు సుమారు రాష్ట్రంలోని 127 గుళ్లపై అనేక రకాల దాడులు జరిగాయన్నారు. విజయవాడ ఇంద్రకీలాద్రిలో రథంపై మూడు వెండి సింహాలు మాయమైనప్పటి నుంచి ఈ రగడ మొదలైందని.. అంతర్వేధిలో రథం దగ్ధం.. శ్రీరాముడు, సీత విగ్రహాల ధ్వంసం ఎక్కడో అక్కడ దారుణాలు జరుగుతూనే ఉందన్నారు. అయితే ప్రభుత్వం ఈ దారుణాల చూస్తూ పట్టించుకోవడం లేదని అన్నారు.

ఒక్క అవకాశం ఇవ్వమంటే ప్రజలు ఇచ్చారని, మరి రాష్ట్రంలో అభివృద్ధి జరుగుతుందా? అని బాలయ్య ప్రశ్నించారు. వినాశకాలే విపరీత బుద్ధి అని, ఇప్పటినుంచే వైసీపీ పతనం ప్రారంభమవుతుందని బాలకృష్ణ వ్యాఖ్యానించారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -