Friday, May 3, 2024
- Advertisement -

కాంగ్రెస్‌లో చేరిన ప‌వ‌న్ వీరాభిమాని..

- Advertisement -

ప‌వ‌న్ క‌ళ్యాన్ వీరాభిమాని, బ‌డా నిర్మాత బండ్ల గ‌నేష్ జ‌న‌సేనుడికి భారీ షాక్ ఇచ్చారు. ప‌వ‌న్ నాకు దేవుడు.. తండ్రి లాంటి వాడని గ‌తంలో త‌న అభిమానాన్ని చాటుకున్న బండ్ల ఇప్పుడు హ‌స్తం గూటికి చేరారు. ఢిల్లీలోని కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ సమక్షంలో బండ్ల గణేశ్ కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు. వచ్చే శాసనసభ ఎన్నికల్లో ఆయనకు షాద్‌నగర్ నియోజకవర్గం టిక్కెట్ కేటాయించే అవకాశం ఉన్నట్టు సమాచారం.

తాను ఏ షరతులతో కాంగ్రెస్ పార్టీలో చేరలేదన్నారు. పార్టీ ఆదేశాలను తాను ఖచ్చితంగా పాటిస్తానని ఆయన చెప్పారు. కాంగ్రెస్ పార్టీది త్యాగాల చరిత్రగా ఆయన గుర్తు చేశారు. జ‌న‌సేన కంటే కాంగ్రెస్ పార్టీ అంటేనే త‌న‌కు అభిమాన‌మ‌ని గ‌ణేష్ తెలిపారు. తండ్రిని, నానమ్మను కూడ రాహుల్ గాంధీ దేశం కోసం పోగోట్టుకొన్నాడని చెప్పారు.

అయితే షాద్ న‌గ‌ర్‌ నుంచి పోటీ చేసే అవ‌కాశాలున్న‌ట్లు తెలుస్తోంది. ఆయ‌న చేరిక‌తో షాద్ నగర్‌లో కాంగ్రెస్ మరింత బలపడుతుందని, ఆయన సినీ గ్లామర్ ఉపయోగపడుతుందని కాంగ్రెస్ నేతలు భావిస్తున్నారు. సినీ నిర్మాతగా వ్యవహరిస్తూ రాజకీయ ప్రముఖులతో సత్సంబంధాలు కొనసాగిస్తోన్న బండ్లకు రాహుల్‌తోనూ పరిచయం ఉంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -