తెలంగాణ కాంగ్రెస్లో చేరిక పర్వం కొనసాగుతోంది. తాజాగా భద్రాచలం ఎమ్మెల్యే తెల్రం వెంకట్రావ్ హస్తం గూటికి చేరిపోయారు. హైదరాబాద్లో సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్లో చేరారు. వెంకట్రావుతో పాటు భద్రాచలం నియోజకవర్గానికి చెందిన కీలక నేతలు కాంగ్రెస్ గూటికి చేరారు.
వాస్తవానికి తొలుత హస్తం గూటికి చేరేది వెంకట్రావేనని వార్తలు వచ్చాయి. ఎందుకంటే మంత్రి పొంగులేటి ప్రధాన అనచరుడు వెంకట్రావ్. అయితే కాంగ్రెస్లో చేరిక వార్తలను ఆయన ఖండిస్తూ వస్తున్న రూమర్స్ మాత్రం ఆగలేదు. చివరికి కాంగ్రెస్లో చేరిపోయారు వెంకట్రావ్.
ఇటీవల జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో పొదెం వీరయ్యను ఓడించారు వెంకట్రావ్. ఇక ఆయన కంటే ముందు ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం, స్టేషన్ ఘన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి కాంగ్రెస్లో చేరారు. ఇక తాజాగా వెంకట్రావ్ చేరికతో ఖమ్మం జిల్లాలో ఒక్క బీఆర్ఎస్ ఎమ్మెల్యే లేకుండా పోయారు.