Friday, May 17, 2024
- Advertisement -

పొలిటికల్ బ్రేకింగ్……. వైకాపాలోకి బిజెఎల్పీ లీడర్ విష్ణుకుమార్‌రాజు

- Advertisement -

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో ఒక సంచలన వార్త గుప్పుమంటోంది. ఉత్తరాంధ్రలో వైకాపాను బలోపేతం చేయడం కోసం అహర్నిశలూ కష్టపడుతున్న విజయసాయిరెడ్డి వైకాపా శ్రేణులకు అత్యంత ఉత్సాహాన్ని ఇచ్చే ఒక కార్యక్రమాన్ని సాధించాడని విశాఖలో వార్తలు హల్చల్ చేస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో బిజెపి ఫ్లోర్ లీడర్ విష్ణు కుమార్ రాజు త్వరలో వైకాపాలో చేరనున్నాడన్నదే ఆ వార్త. ఇప్పటికే వైఎస్ జగన్‌కి పెరుగుతున్న బలం గురించి, జగన్ పాదయాత్ర దిగ్విజయం అవుతున్న విషయాల గురించి ప్రశంశలు కురిపించాడు విష్ణుకుమార్‌రాజు.

ఈ ప్రాసెస్‌లోనే వైకాపాలో చేరాలన్న తన ఆసక్తిని విజయసాయిరెడ్డితో చెప్పుకున్నాడట విష్ణుకుమార్‌రాజు. కేంద్ర ప్రభుత్వం రైల్వే జోన్ ఇవ్వకపోవడంతో వచ్చే ఎన్నికల్లో బిజెపికి విశాఖలో కనీస స్థాయి ఓట్లు కూడా పడే అవకాశం లేదు. మరోవైపు టిడిపి కూడా బలహీనంగా ఉంది. అందుకే చంద్రబాబు విశాఖ మునిసిపల్ ఎన్నికలను కూడా పోస్ట్ పోన్ చేసే ఆలోచనతో ఉన్నాడు. ఈ నేపథ్యంలో టిడిపిలో చేరినా ప్రయోజనం ఉండదని భావించిన విష్ణుకుమార్ రాజు వైకాపాలో చేరడానికి ఉత్సాహం చూపించాడు. వైఎస్ జగన్ కూడా ఈ చేరికకు తన సమ్మతి తెలియచేశాడని తెలుస్తోంది. వైఎస్ జగన్ పాదయాత్ర విశాఖలో అడుగిడిన రోజే విష్ణుకుమార్‌రాజు వైకాపాలో చేరతాడని పొలిటికల్ సర్కిల్స్‌లో వార్తలు వినిపిస్తున్నాయి. ఈ చేరిక నిజం అయితే మాత్రం చంద్రబాబుకు బిగ్గెస్ట్ షాక్‌గానే చెప్పాలి. 2014 ఎన్నికల్లో ఎక్కడైతే వెనుకడుగేశాడో ఈ సారి 2019 ఎన్నికల్లో అదే విశాఖలో విజయం సాధించడానికి జగన్‌కి ఈ చేరికలు చాలానే బలం అవుతాయనడంలో సందేహం లేదు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -