Friday, May 3, 2024
- Advertisement -

ప్ర‌త్యేక‌హోదా గుట్టును బ‌య‌ట పెట్టిన భాజాపా ఎంపీ జీవీఎల్‌..

- Advertisement -

కాంగ్రెస్‌, టీడీపీపై భాజాపా ఎంపీ జీవీఎల్ విమ‌ర్శ‌లు గుప్పించారు. ప్ర‌త్యేక హోదా గుట్టు విప్పారు. రాష్ట్రానికి ప్ర‌త్యేక హోదా ఇవ్వ‌కుండా కాంగ్రెస్ అడ్డుకుంద‌ని ఆరోపించారు. ఇప్పుడొచ్చి కాక‌మ్మ క‌థ‌లు చెబుతున్నార‌ని ఎద్దేవ చేశారు. విభ‌జ‌న స‌మ‌యంలో ప్ర‌త్యేక హోదాపై ఆర్‌బీఐ గ‌వ‌ర్న‌ర్ ర‌ఘురామ్ రాజ‌న్ నేతృత్వంలో క‌మిటీ వేశార‌ని తెలిపారు. ఆ క‌మిటీ కొన్ని రాష్ట్రాల‌కు ప్రత్యేకహోదా ఇవ్వడం ఆమోదనీయం కాదని రఘురాం రాజన్ సెప్టెంబర్ 23న నివేదిక ఇచ్చారని పేర్కొన్నారు.

ఇప్పుడు ఆంధ్రులను మోసం చేసేందుకు సీఎం చంద్రబాబు, సోనియా గాంధీ మరోసారి చేతులు కలుపుతున్నాయని ఆరోపించారు. రఘురాం రాజన్ ద్వారా ప్రత్యేక హోదాకు శఠగోపం పెట్టించారనీ, ఆంధ్రులను మోసం చేస్తూ దొంగనాటకం ఆడుతున్నారని దుయ్యబట్టారు. కేసీఆర్ సోనియా గాంధీనీ ప‌ల్లెత్తు మాట కూడా అన‌డంలేద‌న్నారు.

మ‌రో వైపు కేసీఆర్‌పై కూడా ఆరోప‌న‌లు చేశారు. టీఆర్ఎస్‌, కాంగ్రెస్ లాలూచీనీ తెలంగాణా ప్ర‌జ‌లు గ‌మ‌నిస్తున్నార‌న్నారు. తెలంగాణలో కాంగ్రెస్, టీఆర్ఎస్ పార్టీలు అవినీతిలో కూరుకుపోయాయని ఆరోపించారు. ఇవన్నీ కుటుంబ పార్టీలేననీ, వీటి మధ్య లాలూచీ సులభంగా కుదురుతుందని వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ పార్టీలో తల్లీ-కొడుకుల రాజ్యం నడుస్తుంటే, టీడీపీలో తండ్రీకొడుకుల రాజ్యం నడుస్తోందని ఎద్దేవా చేశారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -