Wednesday, May 15, 2024
- Advertisement -

ఆంధ్రా విజయ్‌మాల్యా ఎక్క‌డ‌…జీవీఎల్‌

- Advertisement -

భాజాపా ఎంపీ జీవీఎల్ చంద్ర‌బాబు నాయుడుతో పాటు ఆ పార్టీకీ కొర‌క‌రాని కొయ్య‌గా మారారు. ప్ర‌భుత్వం చేస్తున్న అవినీతిపై ప్ర‌భుత్వానికి కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నాడు. జ‌గ‌న్‌పై దాడి త‌ర్వాత జీవీఎల్ బాబు, ర‌మేష్‌పై సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు.

ఢిల్లీ పర్యటనలో భాగంగా చంద్రబాబు అబద్ధాలు చెప్పే ప్రయత్నం చేశారని వ్యాఖ్యానించారు. ఏపీలో రాష్ట్రపతి పాలన పెట్టే ఉద్దేశ్యం కేంద్రానికి లేదని.. ఈ ప్రభుత్వాన్ని ఆరు నెలల్లో ప్రజలే ఇంటికి పంపుతారని జీవీఎల్ జోస్యం చెప్పారు.కేంద్ర దర్యాప్తు సంస్థతో విచారణ జరిపించాలని వైసీపీ కోరుతుంటే.. టీడీపీ మాత్రం వద్దనడం దారుణంగా ఉందని నరసింహారావు ఆరోపించారు. తన వద్ద అన్ని వివరాలు ఉన్నాయని ముఖ్యమంత్రి అంటున్నారు.. కేసు దర్యాప్తు వివరాలు చంద్రబాబు వద్ద ఉండటమేమిటని జీవీఎల్ ప్రశ్నించారు.

ఐటీ దాడుల విషయంలో మీసం మెలేసి ఆంధ్రా విజ‌య్‌మాల్యా సీఎం రమేశ్.. రెండు రోజులుగా కనిపించడం లేదని…ఆయ‌న ఎక్క‌డున్న బ‌య‌ట‌కు రావాల‌ని డిమాండ్ చేశారు. కనీసం మాట్లాడాలని కోరారు… సీబీఐ ముడుపుల వ్యవహారంలోనూ సీఎం రమేశ్ పేరు ప్రధానంగా వినిపిస్తోందని నరసింహారావు ఆరోపించారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -