Monday, April 29, 2024
- Advertisement -

టీడీపీ ఆవిర్బావ సభ సందర్భంగా చొక్కాలు చించుకున్న తెలుగు త‌మ్ముళ్లు….

- Advertisement -

రాష్ట్రంలోని అన్నిజిల్లాల్లో టీడీపీలో విబేధాలు భ‌య‌ట‌ప‌డుతున్నాయి. క‌ర్నూలు జిల్లా ఆళ్ల‌గ‌డ్డ నియోజ‌క వ‌ర్గంలో మంత్రి అఖిల‌ప్రియ‌, ఏవీ సుబ్బారెడ్డి మ‌ధ్య విబేధాలు ర‌చ్చ‌కెక్కిన సంగ‌తి తెలిసిందే. ఇప్పుడు తాజాగా విజయనగరం జిల్లా బొబ్బిలిలో తెలుగు త‌మ్ముళ్ల మ‌ధ్య విభేదాలు మరోసారి భగ్గుమన్నాయి.

టీడీపీ ఆవిర్బావ సభ సందర్భంగా ఫిరాయింపు మంత్రి సుజయకృష్ణ రంగారావు సొంత నియోజకవర్గం బొబ్బిలి లో టిడిపి పాత కార్యకర్తలకు, మంత్రి అనుచరులకు నెలకొన్న విభేదాలు తారాస్థాయికి చేరాయి. పార్టీ ఆవిర్బావ దినోత్సవం సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో.. పార్టీలో పాతికేళ్లగా ఉన్న తమకు ప్రాధాన్యత ఇవ్వడం లేదని.. సీనియర్ కార్యకర్తలు, ద్వితీయ శ్రేణి నేతలు మంత్రిని నిలదీశారు.

ఫిరాయించిన నేత‌ల‌కు అధిక ప్రాధాన్య‌త బాబు ఇస్తున్నారు. దీంతో పార్టీనే న‌మ్ముకొని ఉన్న నేత‌లు బాబుపై తీవ్ర అసంతృప్తిని వ్య‌క్తం చేస్తున్నారు. బాబును డైరెక్ట్‌గా విమ‌ర్శించ‌క‌పోయినా పార్టీ కార్య‌క్ర‌మాల్లో మాత్రం త‌మ నిర‌స‌న తెలుపుతున్నారు టీడీపీ త‌మ్ముళ్ళు.

పార్టీ కార్య‌క్ర‌మాల సమావేశాలకు తమకు సమాచారం ఇవ్వడం లేదని…. పనులు కూడా మంత్రి సుజ‌య‌కృష్ణ‌రంగారావు త‌న అనుచ‌రుల‌కే ఇచ్చుకుంటున్నార‌ని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రతిగా మంత్రి సుజయకృష్ణ రంగారావు అనుచరులు వారిని అడ్డుకున్నారు. దీంతో ఇరువర్గాల మధ్య తోపులాట జరిగింది. రెచ్చిపోయిన తెలుగు తమ్ముళ్లు చొక్కాలు చింపుకున్నారు. దీంతో సమావేశం కాసేపు రసాభాసగా మారింది. పార్టీలో విబేధాలను బాబు ఎలా ప‌రిస్క‌రిస్తార‌న్న‌ది చ‌ర్చ‌నీయాంశంగా మారింది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -