ఎన్డీఏ కూటమి నుండి తెలుగుదేశం పార్టీ బయటకు వచ్చేసినప్పటి నుండి చంద్రబాబుకు కష్టాలు మొదలయ్యాయి. ఎప్పుడైతే టిడిపి ఎన్డీఏలో నుండి బయటకు వచ్చేసిందో అప్పటి నుండే చంద్రబాబు అవినీతిపై బిజెపి నేతలు పదే పదే ప్రస్తావిస్తున్నారు. అవినీతిపై సబీఐ లేదా సిట్టింగ్ జడ్జీచేత విచారణ జరిపించాలని డిమాండ్ చేస్తున్న సంగతి తెలిసిందే.
ఇదలా ఉంటూ ఇప్పుడు బాబు, లోకేష్లకు శేఖర్ రెడ్డి ఉదంతం చర్చనీయాంశంగా మారింది. గతంలో శేఖర్రెడ్డి ఇంట్లో భారీగా నగదు, బంగారం పట్టుబడిన సంగతి తెలిసిందే. శేఖర్రెడ్డి అవినీతిలో లోకేష్కు భాగం ఉందని జనసేన అధినేత పవన్ సంచలన వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. అయితే తర్వాత పవన్ సైలెంట్ అయ్యారు.
ఇప్పుడు తాజాగా వైసీపీ నేత బొత్స సత్యనారాయణ ఓ ఛానల్ ఇంటర్యూలో చంద్రబాబుపై సంచలన ఆరోపణలు చేశారు. బొత్త చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు దుమారం రేపుతున్నాయి. శేఖర్ రెడ్డి తొ చంద్రబాబు కు ఉన్న సంబంధాలపై తన వద్ద ఆధారాలు ఉన్నాయని బొత్స బాంబు పేల్చారు.
నోట్ల రద్దు సందర్భంగా బాబు శేఖర్రెడ్డి ద్వారా రూ.500 కోట్ల నల్లధనాన్ని తెల్లదనంగా మార్చుకున్న విషయాన్ని సబీఐకి శేఖర్రెడ్డి వాగ్మూలం ఇచ్చారన్నారు. సిబిఐ నివేదిక బయట పడితే చంద్రబాబుతొ శేఖర్ రెడ్డి కి ఉన్న లింకు బయటపడుతుందని బొత్స అన్నారు.
శేఖర్ రెడ్డితొ చంద్రబాబు సంబంధాలపై జన సేన అధినేత పవన్ కళ్యాణ్ ఆరోపణ చేసి, సైలెంట్ అయ్యారని…తానూ ఈ విషయం పై ఆరా తీస్తే చాలా వాస్తవాలు బయట పడ్డాయని బొత్స వ్యాఖ్యానించారు. ఎన్డీఏ నుంచి బాబు బయటకు వచ్చిన తర్వాత కేంద్రం బాబు అవినీతికి సంబంధించిన అన్ని ఆధారాలను సిద్ధం చేసిందనే వార్తలు వినిపిస్తున్నాయి.