- Advertisement -
మరో సారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని టీడీపీ ధీమాతో ఉంది.ఈ ఎన్నికల్లో టీడీపీ 110-140 సాధించబోతోందని అన్ని సర్వేలు స్పష్టం చేశాయని బాబు నేతలకు భరోసా ఇచ్చారు. రాష్ట్రంలో టీడీపీ గెలుపు 1000 శాతం తథ్యమని పునరుద్ఘాటించారు. అమరావతిలో టీడీపీ నేతలు, ప్రజాప్రతినిధులతో చంద్రబాబు ఈరోజు టెలీకాన్ఫరెన్స్ లో బాబు ఈ వ్యాఖ్యలు చేశారు.ప్రజాస్వామ్యాన్ని నిలబెట్టడానికే టీడీపీ పోరాటం చేస్తోందని చంద్రబాబు తెలిపారు. వైసీపీ అరాచకాలను, బీజేపీ తప్పుడు పనులను ప్రజల్లో ఎండగట్టామని వ్యాఖ్యానించారు. పోలింగ్ సమయంలో టీడీపీపై జరిగిన దాడులను సమర్థవంతంగా ఎదుర్కొన్నామని బాబు తెలిపారు.