Monday, May 20, 2024
- Advertisement -

మహిళను అడ్డుపెట్టుకుని చంద్రబాబు, రాధాకృష్ణలు పవన్‌ని బ్లాక్‌మెయిల్ చేస్తున్నారా?

- Advertisement -

ఇంత వరకూ ఏ ఒక్కరితో పొత్తు లేకుండా సొంతంగా చంద్రబాబు నాయుడు ఎన్నికల్లో ఎప్పుడూ గెలిచింది లేదు. ఆ విషయం చంద్రబాబుకు కూడా తెలుసు. 2019 ఎన్నికల్లో వైఎస్ జగన్‌తో ముఖాముఖి తలపడితే ఒంటరిగా గెలవడం అసాధ్యం అన్న సంగతి అందరికంటే ఎక్కువగా చంద్రబాబుకే తెలుసు. 2014 ఎన్నికల్లో ఉపయోగపడిన మోడీని దారికి తెచ్చుకోవడం చంద్రబాబుకు అసాధ్యం. అందుకే ఎలా అయినా పవన్ కళ్యాణ్‌ని మాత్రం బెదిరించో, బ్లాక్ మెయిల్ చేసో దారికి తెచ్చుకోవాలని చంద్రబాబు అనుకుంటున్నాడా?

బహరింగ సభలో చంద్రబాబు, లోకేష్‌ల అక్రమాలు, అవినీతి గురించి పవన్ మాట్లాడక ముందే 2019లో టిడిపికి వ్యతిరేకంగా పవన్ బరిలోకి దిగుతాడని చంద్రబాబుకు తెలుసు. అందుకే వ్యూహాత్మకంగా ఒక హీరోయిన్‌తో పవన్ సంబంధాన్ని టివి9, ఎబిఎన్ ఆంధ్రజ్యోతి మీడియా సంస్థలు బాగా హైలైట్ అయ్యేలా చేశాయి. మహేష్ కత్తిని అడ్డం పెట్టుకుని పచ్చ మీడియా ఆడిన డ్రామా అంతా ఇంతా కాదు. పైగా పవన్‌కి వ్యతిరేకంగా అంతా జగన్ చేయిస్తున్న కుట్ర ఇది అని సోషల్ మీడియాలో మరో రకం దుష్ప్రచారం కూడా మొదలెట్టారు. పవన్ అభిమానులకు జగన్‌ని శాశ్వితంగా శతృవును చేయడానికి కుట్రలు పన్నారు.

అయితే ఇప్పుడు మాత్రం పవన్ అభిమానులకు పూర్తిగా మబ్బులు విడిపోయాయి. రాష్ట్ర సమస్యల కోసం అని చెప్పి ఢిల్లీ వెళ్ళిన చంద్రబాబు ప్రత్యేకంగా పవన్‌పై ఆరోపణలు చేసిన ఆ హీరోయిన్‌ని కలవడం….ఆ హీరోయిన్ దగ్గర నుంచి ఒక పెన్ డ్రైవ్‌లో ఆధారాలు తీసుకున్నాడన్న వార్తలు….. ఇలా పవన్‌ని బ్లాక్ మెయిల్ చేసే గేంని ఎవరు నడిపిస్తున్నారో మెగాభిమానులకు కూడా చాలా స్పష్టంగా అర్థమైంది. ఇప్పుడు కూడా ఎబిఎన్‌లో ఆ హీరోయిన్‌కి ఇస్తున్న ప్రాధాన్యత చూస్తుంటే తెరవెనుక మంత్రాంగం మొత్తం బాబు రాజకీయ కుట్రలు, వ్యూహాల విషయంలో అన్నీ తానే అయి వ్యవహరిస్తున్న రాధాకృష్ణనే తెరవెనుక మంత్రాంగం నడిపిస్తున్నాడన్న విషయం అర్థమవుతుందని రాజకీయ విశ్లేషకులు చెప్పుకొస్తున్నారు. అన్నింటికీ మించి సునీత అనే ఆర్టిస్ట్ మహేష్ కత్తిపైన ఆరోపణలు చేస్తే మహాటీవీ, టివి9లు ఆ మహిళకు అండగా నిలవకపోగా……మహేష్ కత్తి తరపున వకాల్తా పుచ్చుకుని ఆ మహిళనే బెదిరిస్తూ ఉండడం సంచలనం రేపుతోంది. ఇక మహేష్ కత్తి కూడా డైరెక్ట్‌గా మెగా ఫ్యామిలీనే టార్గెట్ చేస్తున్నాడు. ఈ మొత్తం వ్యవహారం చూస్తుంటే పవన్‌ కళ్యాణ్‌ని బెదిరించో, బ్లాక్ మెయిల్ చేసి అయినా సరే చంద్రబాబుకు మద్దతు ఇచ్చేలా ఒప్పించడానికి చాలా పెద్ద మంత్రాంగమే నడుస్తూ ఉన్నట్టుందని సీనియర్ జర్నలిస్టులు అభిప్రాయపడుతున్నారు. సీనియర్ ఎన్టీఆర్ నుంచీ జూనియర్ ఎన్టీఆర్ వరకూ కూడా మనుషుల విషయంలో చంద్రబాబు వ్యూహాలు, కుట్రల గురించి అవగాహన ఉన్నవారికి మాత్రం అసలు విషయాలన్నీ ఇట్టే అర్థమైపోతున్నాయి. ఈ పద్మవ్యూహం నుంచీ పవన్ ఎలా బయటపడతాడో చూడాలి మరి.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -