Tuesday, May 14, 2024
- Advertisement -

నీ వళ్ళ పార్టీకి ఏమీ ఉపయోగం లేదు : మురళీమోహన్‌తో బాబు

- Advertisement -

ఎన్నికలకు ఇంకో ఏడాది సమయం ఉండగానే ఎన్నికల మూడ్‌లోకి వెళ్ళిపోయారు చంద్రబాబు. ప్రభుత్వ కార్యక్రమాలన్నింటిలోనూ ఎన్నికల సభల్లో ఇచ్చే తరహాలోనే ప్రసంగాలు ఇస్తున్నారు. విపక్షాలన్నీ కూడా తనను ఒంటరిని చేయాలని చెప్తూ సానుభూతి కోసం ప్రయత్నం చేస్తున్నారు. మీడియా ముందు, ప్రజలకు తెలిసేలా ఇలాంటి రాజకీయాలు నడిపిస్తున్న చంద్రబాబు తెరవెనుక మాత్రం టిడిపి ఎంపిలు, ఎమ్మెల్యేలపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 2019 ఎన్నికల్లో టిడిపి గెలుపు ఖాయం అని మీడియా ముందు ఢంకా బజాయించి చెప్తున్న చంద్రబాబు తెరవెనుక మాత్రం నాయకులపై ఆవేశం వ్యక్తం చేస్తున్నారు.

చంద్రబాబు సొంత సర్వేలు, ఇంటెలిజెన్స్ సర్వేలు కూడా 2019 లో టిడిపి గెట్టెక్కడం కష్టమనే చెప్తున్నాయి. ఇక జాతీయ స్థాయి మీడియా నుంచి స్థానిక మీడియా సర్వేల వరకూ అన్నీ కూడా వైకాపా గెలుపు ఖాయం అని తేల్చేస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే టిడిపి ఎమ్మెల్యేలు, ఎంపిలపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాడు చంద్రబాబు. ఇంతకుముందు ఎవి సుబ్బారెడ్డి మద్దతు లేకపోతే కనీసం 20వేల ఓట్ల తేడాతో ఓడిపోతావ్ తెలుసా అని అఖిలప్రియతో బాబు అనడంతో అఖిలప్రియ షాక్ అయింది. తాజాగా మురళీ మోహన్‌పై విమర్శలు చేశాడు చంద్రబాబు. టిడిపికి నీ వళ్ళ ఏమీ ఉపయోగం లేదని డైరెక్ట్‌గా మురళీ మోహన్‌తోనే తేల్చిచెప్పాడట. తెరవెనుక ఉండి పార్టీకి సాయం చేయడం వరకూ ఒకే కానీ 2019 ఎన్నికల్లో రాజమండ్రి నుంచి పోటీ చేస్తే గెలిచే అవకాశం లేదని చెప్పాడట. పార్టీ పరిస్థితి ఏమీ బాగాలేదని…….ఈ సారికి అర్థం చేసుకుని తెరవెనుక ఉండి ఆర్థిక సాయం అందించాలని మురళీ మోహన్‌ని ఆదేశించాడట బాబు. ఎన్నికల్లో గెలిస్తే టిటిడి ఛైర్మన్, రాజ్యసభ సభ్యత్వంలలో ఏదో ఒకటి ఇస్తానని మురళీ మోహన్‌కి ఇచ్చాడట. అసలే పార్టీ పరిస్థితి అంతంత మాత్రం అని చంద్రబాబే స్వయంగా ఒప్పుకుంటున్న నేపథ్యంలో రాజమండ్రి పోటీ చేయబోయే కొత్త వ్యక్తి ఎవరో చూడాలి మరి.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -