ప్రత్యేక హోదాపై తన ఎంపీలచేత రాజీనామాలు చేయించేడానికి సిద్దంగా ఉన్నామని వైసీపీ అధినేత జగన్ ప్రకటించడంతో ఏపీరాజకీయాల్లో ప్రకంపనలను రేపుతోంది. ఇన్నాళ్లు డ్రామాలు ఆడుతున్న టీడీపీ ఎంపీలకు పెద్దషాక్ తగిలిందనడంలో సందేహంలేదు. జగన్ వ్యూహాత్మకంగానే ఈ నిర్ణయం తీసుకున్నారని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
పార్లమెంటు సెషల్ చివరి రోజైన ఏప్రిల్ 6వ తేదీన తమ ఎంపీలు రాజీనామా చేస్తారని ప్రకటించడం ద్వారా 40 ఇయర్స్ ఇండస్ట్రీ చంద్రబాబునాయుడు కంగుతిన్నారు. తర్వాత ఏంచేయాలో మీడియా ముందు ఏంమట్లాడాలో తెలియకు అయోమయంలో ఉన్నారు. జగన్ తీసుకున్న నిర్ణయం బాబును పూర్తి ఆత్మరక్షణలో పడేసింది. అసలు ఏమి జవాబు ఇవ్వాలో కూడా తెలియని అయోమయావస్థలో తెలుగుదేశం నాయకులతోపాటు బాబు అవస్తులు పడుతున్నారు.
6వ తేదీ రాజీనామాలు చేసినా అవి ఆమోదం పొందవని, ఉపఎన్నికలు రావని తెలుగుదేశం నాయకులు ఎదురుదాడులు మొదలుపెట్టారు. ప్రత్యేకహోదా కోసం రాజీనామా చేస్తామని జగన్ ప్రకటించటమే జనాలకు కావాల్సింది. తెలుగుదేశం ఎంపీలు ఢిల్లీలో ఆడిన డ్రామాలను ప్రజలంతా గమనించారు. మామూలుగా మీడియా ముందుకు వచ్చి గంటల తరబ జగన్ను విమర్శించే 40 ఇయర్స్ ఇండస్ట్రీ చంద్రబాబునాయుడు పదిహేను రోజులుగా మీడియా ముందుకు రావడానికే భయపడుతున్నారంటే జగన్ దెబ్బ ఎంత గట్టిగా తగిలిందో అర్ధమైపోతోంది.
టీడీపీ నేతలు ఎదురు దాడులు చేసేకొద్దీ జగన్ కు మైలేజ్ పెరుగుతుంది తప్ప తగ్గదన్న విషయాన్ని టిడిపి మరచిపోతోంది. ఇక రాజీనామాల విషయంలో తెలుగుదేశం పూర్తిగా వెనక్కు తగ్గిందన్నది అర్ధమైపోయింది. కేంద్రమంత్రులు, ఎంపీలతో రాజీనామా చేయించేసేందుకు సిద్దంగా ఉన్నారని మంత్రి అదినారాయణరెడ్డి ప్రకటించిన గంటకే మాటమార్చారు. ఎంపీల రాజీనామాలు చేయాలనడం నా వ్యక్తిగతం అని వివరణ ఇచ్చారు.
ఆదినారయణ రెడ్డికి బాబు క్లాస్ పీకడంతోనే మంత్రిగారు ఆగమేఘాలమీద ప్రెస్ మీట్ పెట్టి వివరన ఇచ్చారు. దీన్ని బట్టి చూస్తే కేంద్రమంత్రులు, ఎంపీలతో రాజీనామా చేయించే ఉద్దేశ్యంలేదని మంత్రి ఆదినారాయణ రెడ్డి వ్యవహారంతో తేలిపోయింది.దీనికి కారనం మంత్రులు, ఎంపీలమీద అవినీతి కేసులు ఉన్నందువల్లే ధైర్యం చేయలేకపోతున్నానే విషయం స్పష్టమవుతోంది. మరి 40 ఇయర్స్ ఇండస్ట్రీ బాబు ఏనిర్ణయం తీసుకుంటారో చూడాలి.