వైసీపీలో ఫైర్ బ్రాండ్గా పేరు తెచ్చుకుంది ఎమ్మెల్యే రోజా. టీడీపీ నుంచి ఎంతమంది నాయకులు జగన్పై చేసిన వ్యాఖ్యలను తిప్పికొట్టగల సమర్థురాలు రోజా. సీఎం చంద్రబాబుకే ముచ్చెమటలు పట్టించగల నాయకురాలు రోజా.ఒక దశలో చంద్రబాబుని ఫుట్ బాల్ ఆడుకున్న రోజాని తట్టుకోవాలంటే ఆమెను అసెంబ్లీలోకి రాకుండా చేయాలని చంద్రబాబు అన్నంత పని చేశారు. కొన్ని నెలల పాటు అసెంబ్లీకి రానీయకుండా బాబు అడ్డుకున్నా… పట్టు వదలకుండా కోర్టు ద్వారా ఉత్తర్వలు తెచ్చుకున్న రోజా ఎట్టకేలకు మళ్లీ అసెంబ్లీలోకి అడుగుపెట్టింది. ఇలా అయితే లాభం లేదనుకొని బాబు అసలు అసెంబ్లీలోకి అడుగు పెట్టకుండా చేయడానికి మాస్టర్ ప్లాన్ వేస్తున్నారు.
సీఎం చంద్రబాబు, పార్టీ నేతలకు ధీటుగా సమాధానం ఇవ్వగల రోజాకు చెక్ పెట్టడానికి బాబు ఈ సారి త్రిసభ్య కమిటీ వేశారు. ఫైర్ బ్రాండ్గా పేరున్న రోజాకు చెక్ పెట్టడం అంత ఈజీ అవుతుందా…? త్వరలో జరిగే ఎన్నికల్లో నగరినుంచి ఓడించి ఇంటికి పంపాలని బాబు తవ్రంగా కసరత్తు చేస్తున్నారు.
నగరి నుంచి రోజాకు పోటీగా బలమైన నేతను దించాలని చంద్రబాబు కసరత్తులు చేస్తుంటే బాబు ప్లాన్ బెడిసికొట్టేలా తెలుగు తమ్ముళ్లు పావులు కదుపుతున్నారు. నగరి నుంచి టీడీపీ టికెట్పై తీవ్ర పోటీ నెలకొంది. మాజీ మంత్రి గాలి ముద్దు కృష్ణమనాయుడు అకాల మరణంతో టిక్కెట్టు ఎవరికి ఇవ్వాలనే విషయమై బాబు మల్లగుల్లాలు పడుతున్నాడు. టికెట్ ఆశిస్తున్న వారిలో నగరి పార్టీగా ఇంచార్జ్ గ ఉన్న ముద్దుకృష్ణమనాయుడు పెద్ద కొడుకు గాలి భానుప్రకాష్, ఆయన తమ్ముడు గాలి జగదీష్, సిద్ధార్థ ఇంజినీరింగ్ కాలేజీస్ ఛైర్మన్ కొండూరు అశోక్ రాజు పోటీపడుతున్నారు. గాలి సతీమణి సరస్వతమ్మ తన చిన్న కొడుకు జగదీష్కు టిక్కెట్టు ఇవ్వాలని చంద్రబాబునాయుడుపై ఒత్తడి మొదలయ్యింది. భానుప్రకాష్కు ఆయన తల్లి, సోదరుడు జగదీష్ కూడ వ్యతిరేకంగా ఉన్నారు
ఇలా డిమాండ్లు మొదలుకావడంతో నగరి అభ్యర్థి కోసం బాబు ఏకంగా త్రిసభ్య కమిటీని నియమించారు. ఈ కమిటీలో ఆర్థిక మంత్రి యనుమల, ఎమ్మల్సీ అశోక్ బాబు, ఎమ్మెల్సీ జనార్థన్రెడ్డి మెంబర్లుగా ఉన్నారు. ఈ కమిటీ ఇచ్చే నివేదికపైనే నగరి టికెట్ బాబు కేటాయించనున్నారు. ఇప్పటికే అన్ని సర్వేలు వైసీపీకీ అనుకూలంగా ఉండటంతో రోజాకు బాబు చెక్ పెట్టగలరా..అన్నది వేచి చూడాల్సిందే…?