వైసీపీ అధినేత జగన్పై నిత్యం విమర్శలు చేసే చంద్రబాబులో మార్పు వచ్చింది. అక్రమాస్తులకేసులో జగన్ జైలుకెల్తారని బాబుతోపాటు, టీడీపీనేతలు ఆరోపనలు చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే తాజాగా ఇదే విషయంపై జగన్పై బాబు చేసిన వ్యాఖ్యలు ప్రాధాన్యతను సంతరించకున్నాయి.
కేంద్రంపై అవిశ్వాస తీర్మానం పెట్టాడానికి టీడీపీ, వైసీపీలు సిద్దమవుతుండటంతో హస్తిన రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి. ఢిల్లీలో ఉన్న టీడీపీ ఎంపీలతో ఈరోజు ఆయన టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. రాష్ట్ర ప్రయోజనాలే మనకు ముఖ్యమని చెప్పారు. జాతీయ స్థాయిలో మన గొంతుకను వినిపించామని… ఇప్పుడు యావత్ దేశం మనవైపే చూస్తోందని చెప్పారు. పార్లమెంటులో కేంద్ర ప్రభుత్వంపై పోరాటాన్ని తీవ్రతరం చేయాలని మార్గనిర్దేశం చేశారు.
వైసీపీ అధినేత జగన్ కేసులను రేపోమాపో జగన్ కేసులన్నీ కొట్టేయబోతున్నారంటూ ఎంపీలకు తెలిపారు బాబు. అందుకే ఆ పార్టీ ఎంపీ విజయసాయిరెడ్డి, ఇతర నేతలు ప్రధాని కార్యాలయంలో తిరుగుతున్నారని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. దానికి ప్రతిఫలంగానే కేసులలో జగన్ కు సడలింపులు వస్తున్నాయని చెప్పారు. రేపోమాపో జగన్ కేసులన్నింటినీ కొట్టివేయబోతున్నారనే ప్రచారం కూడా జరుగుతోందని సంచలన వ్యాఖ్యలు చేశారు.