Tuesday, May 14, 2024
- Advertisement -

అభివృద్ధికి అడ్డుపడడం అంటే ఇది….. హోదా పోరాటంపై బాబు కుట్రలు షురూ

- Advertisement -

ప్రత్యేక హోదా వస్తే ఆంధ్రప్రదేశ్ ఏ స్థాయిలో అభివృద్ధి చెందుతుందో ఇప్పుడు ప్రత్యేకంగా జగన్ చెప్పాల్సిన అవసరం లేదు. హోదా వస్లే ఎన్ని లాభాలు ఉంటాయో, ఎన్ని ప్రయోజనాలు దక్కుతాయో చంద్రబాబు, వెంకయ్య, పవన్‌లతో పాటు ఈనాడు, ఆంధ్రజ్యోతిలు 2014 ఎన్నికల సమయంలో రోజుల తరబడి చెప్పారు. ఆ హోదా మేం తెస్తామని చెప్పి ఓట్లు కొల్లగొట్టారు. అఫ్కోర్స్ ఆ తర్వాత ఓటుకు కోట్లు కేసు అయితేనేం, బాబు ఇతర స్వార్థ ప్రయోజనాల కోసం అయితేనేమి హోదా గొప్పతనం గురించి చెప్పిన అదే జనాలు హోదా వేస్ట్ అని నాలుక మడతేశారు. స్వార్థం కోసం హోదాకు మంగళం పాడేసి ఉండొచ్చుగాక…….కానీ వాళ్ళు ఫెయిల్ అయిన అదే హోదాను తీసుకొస్తానని జగన్ అంటున్నాడు. ఆ హోదా కోసం తన ఎంపిల చేత రాజీనామా చేయించడానికి డెడ్ లైన్ ఫిక్స్ చేశాడు. ఢిల్లీ వేదికగా ధర్నా చేస్తానంటున్నాడు.

నిజంగా ఆంధ్రప్రదేశ్ ప్రజల ప్రయోజనాల విషయంలో చిత్తశుద్ధి ఉన్నవాళ్ళయితే ఏం చేస్తారు? బాబు అండ్ బ్యాచ్‌కి చేతకాని ప్రయత్నాన్ని చేస్తున్న జగన్‌ని అభినందిస్తారు. తెలంగాణా రాష్ట్రం కోసం పోరాడుతున్న కేసీఆర్‌కి ఇదే టిడిపి తెలంగాణా విభాగం మద్ధతివ్వలేదా? తెలంగాణాలో ఉన్న నాయకులు అందరూ మద్దతివ్వలేదా? తెలంగాణా ప్రయోజనాల విషయంలో అక్కడి నాయకులకు ఉన్న చిత్తశుద్ధి ఆంధ్రప్రదేశ్ టిడిపి నాయకులకు లేదా? స్వార్థ ప్రయోజనాల కోసం హోదాను ఫణంగా పెట్టినవాళ్ళు కనీసం వైఎస్ జగన్ హోదా పోరాటాన్ని అణచివేయాలని కుట్రలు పన్నకుండా ఉండలేరా? మద్ధతు ఇవ్వడం తర్వాత కనీసం మౌనంగా ఉండలేరా? కేబినెట్‌లో బడ్జెట్‌ని ఆమోదించి ఆ తర్వాత రాజ్యసభలో అదే బడ్జెట్‌పై విమర్శలు చేస్తున్న సుజనాచౌదరితో…….‘అంత అన్యాయమైన బడ్జెట్‌ని కేబినెట్‌లో ఎలా ఆమోదించావు?’ అని అడిగిన విజయసాయిరెడ్డిని ఆంధ్రప్రదేశ్ ద్రోహి అని విమర్శిస్తున్న బాబు అండ్ బ్యాచ్ ఇప్పుడు ప్రత్యేక హోదా పోరాటాన్ని అడ్డుకోవడాన్ని ఏమనాలి? ఆ మధ్య యువత స్వచ్ఛంధంగా వైజాగ్ బీచ్‌లో ఆందోళన చేస్తామంటే పోలీసులను పెట్టించి పిచ్చి కొట్టుడు కొట్టించిన బాబుని ఆంధ్రప్రదేశ్ ద్రోహి అనకూడదా? ప్రత్యేక హోదా వస్తే ఎన్ని ప్రయోజనాలు ఉంటాయో దేశంలో ఉన్న నాయకులకు, మీడియా మొత్తానికీ తెలుసు. బాబు అండ్ భజన మీడియాకు కూడా తెలుసు. అందుకే 2014లో ఆ స్థాయిలో హోదా గురించి గొప్పగా చెప్పారు. ఇప్పుడు మాత్రం స్వార్థ ప్రయోజనాల కోసం హోదాను తాకట్టుపెట్టేశారు. ఇంకెవరైనా హోదా కోసం పోరాటం చేస్తామన్నా, హోదా తీసుకుని వస్తామన్నా కూడా అడ్డుకోవడమే లక్ష్యంగా అడుగులేస్తూ ఆంధ్రప్రదేశ్‌కి తీవ్ర ద్రోహం చేస్తున్నారు.

2014లో అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచీ కూడా తాను ఇచ్చిన హామీలు అమలు చేయలేక, మోడీ దగ్గర బానిసలా ఉంటూ రాష్ట్రానికి ఏమీ తీసుకురాలేక ఆంధ్రప్రదేశ్‌ని అవినీతిలో నంబర్ ఒన్ రాష్ట్రంగా చేసి అథోగతిపాలు చేస్తున్న చంద్రబాబు అభివృద్ధి జరగకపోవడానికి జగనే కారణం……జగన్ అభివృద్ధిని అడ్డుకుంటున్నాడు అని పదే పదే అబద్ధాలు చెప్తూ ఉంటాడు. అసలు విషయం ఏంటంటే అభివృద్ధికి అడ్డుపడే విషయంలో బాబును మించిన ఘనుడు లేడు. వైఎస్ హయాంలో కూడా వైఎస్ అవినీతి అంటూ దేశం మొత్తం తిరుగుతూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఇమేజ్ డ్యామేజ్ చేశాడు. ఇక పరిటాల హత్య తర్వాత ఆంద్రప్రదేశ్ అంతా కూడా హత్యా రాజకీయాలు నడుస్తూ ఉన్నాయి అని దేశంలోని అన్ని రాష్ట్రాల్లోనూ, ఢిల్లీలోనూ ప్రచారం చేశారు. పరిటాల రవి హత్యకు ప్రధాన కారకుడు అని అప్పుడు బాబు చెప్పిన జేసీ దివాకరరెడ్డి మాత్రం ఇప్పుడు బాబు క్యాంప్‌లో ముఖ్యనాయకుడుగా ఉన్నాడు. ఇక్కడే తెలియడం లేదా……టిడిపి నేతలు హత్యలకు గురైనప్పుడు కూడా బాబు ఎలాంటి రాజకీయ ప్రయోజన కార్యక్రమాలు చేపడతాడో? వైఎస్ అధికారంలో ఉన్నంత కాలం ప్రతిపక్ష నేతగా బాబు చేసిన కార్యక్రమాలు ఇవే. అదే చంద్రబాబు అధికారంలో ఉన్నప్పుడు ప్రతిపక్షనేతగా ఉన్న జగన్ మాత్రం హోదా కోసం ఉద్యమం చేస్తానంటున్నాడు. చేస్తూ ఉన్నాడు. ఇప్పుడు స్పష్టమైన కార్యాచరణ కూడా ప్రకటించాడు. అయితే అధికారంలో ఉన్నప్పుడు బాబువి అవే అడ్డుకునే కుట్ర రాజకీయాలే. హోదా కోసం ఆయన పోరాటం చేయడు……కానీ పోరాటం చేస్తానన్న జగన్ విశ్వసనీయతను దెబ్బతీయడం, జగన్ పోరాటాన్ని అణచడం కుట్రలు పన్నడంలాంటివి మాత్రం బ్రహ్మాండంగా చేస్తాడు. ఇప్పుడిక ఆంధ్రప్రదేశ్ ప్రజలే ఆలోచించుకోవాలి……ఆంధ్రప్రదేశ్ ప్రయోజనాలకు ఎవరు అడ్డుపడుతున్నారో? ఆంధ్రప్రదేశ్ అభివృద్దికి సంజీవని లాంటి ప్రత్యేక హోదాతో సహా రైల్వే జోన్, పోలవరం, రాజధాని నిర్మాణంలాంటి విషయాల్లో ఎవరు రాజకీయాలు చేస్తున్నారో?

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -