Friday, May 3, 2024
- Advertisement -

తప్పు ఎవరిది.. చంద్రబాబుదా ఎన్టీఆర్ దా ?

- Advertisement -

టీడీపీ అధినేత చంద్రబాబును ఎప్పుడు వెంటాడే సమస్య.. ” వెన్నుపోటు అంశం “. ఆయనపై విమర్శలు చేసే క్రమంలో తరచూ వెన్నుపోటు అంశాన్ని తెరపైకి తెస్తుంటారు వైసీపీ నేతలు. చంద్రబాబు ఒక ద్రోహి అని, తన మామ ఎన్టీఆర్ కు వెన్నుపోటు పొడిచి, పార్టీ లాక్కున్నారని వైసీపీ నేతలు విమర్శలు చేస్తూ ఉంటారు. అయితే ఈ వెన్నుపోటు అంశంపై చంద్రబాబు ఎప్పుడు కూడా స్పందించకపోవడంతో ఆయనను ఈ సమస్య ఒక నీడలా వెంటాడుతోంది. అయితే ఎవరు ఊహించని విధంగా బాలయ్య టాక్ షో కు చంద్రబాబు వెళ్ళడం.. ఆ షోలో పలు ఆసక్తికర అంశాలు చర్చకు రావడం ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా నిలుస్తున్నాయి.

ఇటీవల రిలీజ్ అయిన ” ఆన్ స్టాపబుల్ సీజన్ 2 ” ప్రోమో చూస్తే వెన్నుపోటు అంశం ప్రస్తావనకు వచ్చినట్లు తెలుస్తోంది. బిగ్ డెసిషన్ ఏది అనే క్వశ్చన్ తెరపైకి వచ్చినప్పుడు ” 1995 లో తీసుకున్న నిర్ణయం.. ఆరోజు మనం చేసింది తప్పా అంటూ బాలకృష్ణకు బాబు చెప్పడం.. బాలయ్య నాకు గుర్తింది బావ ” అని బదులివ్వడం వంటివి చూస్తే.. అది ఎన్టీఆర్ వెన్నుపోటుకు సంబంధించిన విషయమే అని తెలుస్తోంది. అలాగే ఆయన నా ఆరాధ్య దైవం అని చంద్రబాబు అనడం కూడా సీనియర్ ఎన్టీఆర్ గురించేనని స్పష్టంగా అర్థమౌతోంది. ఈ నేపథ్యంలో చంద్రబాబు చేసిన వ్యాఖ్యలను బట్టి చూస్తే తప్పంతా ఎన్.టి రామారావు దే అన్నట్లుగా ఉందని వైసీపీ నేతలు ఆరోపిస్తున్నారు.

ఎన్.టి రామారావు ఏం తప్పు చేశారో చెప్పాలని వైసీపీ నేత మాజీ మంత్రి కొడాలి నాని డిమాండ్ చేశారు. 1995 లో జరిగిన సంఘటనలు తెరచిన పుస్తకమే. తెలుగుదేశం పార్టీ నుంచి ఎమ్మేల్యేలు, ఎంపీలు చంద్రబాబు పక్షాన చేరడం.. వైశ్రాయ్ హోటల్ వద్ద ఎన్ టి రామారావు పై చెప్పులు విసరడం వంటి అంశాలు తెరపైకి వస్తాయి. అయితే తెరవెనుక ఏం జరిగింది అనేది మాత్రం ఇప్పటికీ మిస్టరినే.. మరి ఈ మిస్టరీకి చంద్రబాబు తెరదించనున్నారా ? అనేది తెలియాలంటే పూర్తి ఎపిసోడ్ వచ్చే వరకు ఎదురు చూడాల్సిందే. ఏది ఏమైనప్పటికి చంద్రబాబు తో బాలయ్య చేసిన ” ఆన్ స్టాపబుల్ ” ప్రోమో రాజకీయ వర్గాల్లో పెను ప్రకంపనలు సృష్టిస్తోంది. మరి ఫుల్ ఎపిసోడ్ ఎలాంటి సంచలనాలకు తెరతీస్తుందో చూడాలి.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -