సీఎం కేసీఆర్కు కరోనా పాజిటివ్.సీఎం కేసీఆర్కు కరోనా సోకినట్లు సీఎస్ వెల్లడించారు.సీఎంకు స్వల్ప లక్షణాలు ఉన్నాయి. అందుకే కరోనా టెస్ట్ నిర్వహించగా పాజిటివ్ గా తేలింది. ఆయన కరోనా భారిన పడ్డారని తెలియగానే అభిమానులు, పార్టీ కార్యకర్తలు కంగారు పడిపోయారు. తమ నాయకుడు త్వరగా కోలుకొని రావాలని మనసారో దైవాన్ని ప్రార్ధిస్తున్నారు. ఈ నేపథ్యంలో పలువురు సినీ, రాజకీయ నేతలు సైతం కేసీఆర్ త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నారు.
తాజాగా సీఎం కేసీఆర్కు కరోనా పాజిటివ్. తాజాగా టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు ట్విట్టర్ లో స్పందించారు. కొవిడ్-19 నుంచి తెలంగాణ సీఎం కేసీఆర్ త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తున్నట్టు తెలిపారు. కేసీఆర్ పరిపూర్ణ ఆరోగ్యం సంతరించుకోవాలని ప్రార్థిస్తున్నట్టు తెలిపారు. మరోవైపు మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ సైతం కరోనా భారిన పడటంతో చంద్రబాబు ఆందోళన చెందారు.