ఆంద్రప్రదేశ్లో కాంగ్రెస్-టీడీపీ రెండూ కలవడంతో పలు రాజకీయా పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. బద్దశత్రువులుగా ఉన్న రెండు పార్టీలు పొత్తు పెట్టుకోవడంతో ప్రకంపనలు రేపుతోంది. దీంతో సీనియర్ నాయకులు ఒక్కొక్కరే పార్టీని వీడుతున్నారు. కాంగ్రెస్ పార్టీకీ వ్యతిరేకంగా ఎన్టీఆర్ తెలుగు ప్రజల ఆత్మగౌరవం కాపాడడానికి టీడీపీనీ స్థాపించారు. రామారావు ఆశయాలను తుంగలోకి తొక్కి ఇప్పుడు బాబు అదే కాంగ్రెస్తో కలసిపోవడం రాజకీయాల్లో హాట్టాఫిక్గా మారిందన్న సంగతి తెలసిందే.
తన వ్యక్తిగ ప్రయోజనాలకోసం బాబు ఎంత నీచానికైనా దిగజారుతారనే విషయం స్పష్టమైంది. రెండు పార్టీలో పొత్తుపై కాంగ్రెస్ సీనియర్ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కనీసీం సీనియర్ నేతలతో సంప్రదించకుండా పొత్తుపై నిర్ణయం ఎలా తీసుకుంటారని అధిష్టానాన్ని ప్రశ్నిస్తున్నారు. పొత్తుకు నిరసనగా కాంగ్రెస్ పార్టీలో రాజీనామాల పరంపర కొనసాగుతోంది.
ఇప్పటికే మాజీమంత్రి వట్టి వసంతకుమార్ కాంగ్రెస్ కు రాజీనామా చేసేశారు. చంద్రబాబు ఢిల్లీలో రాహుల్ ను కలిసిన కొద్దిసేపటికే ఆయన రాజీనామా నిర్ణయం బయటకు వచ్చింది. అయితే.. రెండురోజుల వ్యవధిలోనే మరో మాజీమంత్రి కడపజిల్లాకు చెందిన సి. రామచంద్రయ్య కూడా కాంగ్రెస్ కు రాజీనామా చేశారు.
కాంగ్రెస్ పార్టీకి మరో మెగాస్టార్ చిరంజీవి రాజీనామా చేయడానికి సిద్దంగా ఉన్నారు. పవన్ జనసేన పార్టీనీ పెట్టిన తర్వాత చిరు పార్టీ కార్యకలాపాలకు దూరంగా ఉంటున్నారు. సినిమాలతో ఆయన బిజీగా ఉన్నారు. తెలంగాణాలో జరగనున్న ఎన్నికల్లో చిరంజీవి ప్రచారం చేస్తారని భావించిన కాంగ్రెస్ నేతలు ఫలించలేదు.
చిరు పార్టీనుంచి ఎలా బయటకు రావాలనుకుంటున్న తరుణంలో కాంగ్రెస్, టీడీపీ పొత్తు పెట్టుకోవడం కలసి వచ్చింది. ఇప్పటికే పొత్తును వ్యతిరేకించిన సీనియర్ నేతలు రాజీనామా చేశారు. వారి బాటలోనే చిరు రాజీనామా చేయడానికి సిద్ధంగా ఉన్నారు.
తాజా రాజకీయా పరిణామాల నేపథ్యంలో భవిష్యత్తులో వైసీపీ, జనసేన కలిసే అవకాశాలున్నట్లు వార్తలు వస్తున్న నేపథ్యంలో….చిరు పార్టీని వీడతారనడానికి అనుమానాలు బలపడుతున్నాయని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.