ఏపీకి హోదా సమస్యపై పార్లమెంటు గాంధీ విగ్రహం వద్ద టీడీపీ, వైసీపీ ఎంపీలు నిరసన చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే టీడీపీ ఎంపీ శివప్రసాద్ మాత్రం రోజుకో గెటప్ తో ప్రత్యక్ష మవుతున్న తన నిరసన తెలియజేస్తున్నారు. తాజాగా శివప్రసాద్ ఓ లాగు, చొక్కా వేసుకుని, తలకు స్కూల్ బ్యాగ్ తగిలించుకుని, చేత్తో పుస్తకాలు, పెన్సిల్ తో స్కూలు విద్యార్థి వేషంలో వచ్చారు.
తన దైన శైలిలో మోదీపై విమర్శలు చేశారు. మోదీని కొట్టేత్తాం. బ్యాడ్ బాయ్. మోదీ బ్యాడ్ బాయ్. చంద్రబాబునాయుడు తాత మా ఫ్యూచర్ కోసం కష్టపడుతుంటే, ఫండ్స్ ఇవ్వరా? స్టేటస్ ఇవ్వరా? ఏమీ ఇవ్వకపోతే ఎట్టమ్మా? ఎట్టా డెవలప్ అయ్యేది? మా ఫ్యూచర్ ఎట్లా? దేవాంశ్ మేము టీమున్నాము. అందరూ కలిసి ఈ స్కేలుతో కొట్టేస్తాము. ఈ పెన్సిల్ తో ముఖమంతా గీకేస్తాము. ఏమనుకున్నారో? అన్నీ ఇవ్వాలి” అన్నారు చిన్న పిల్లాడిలా అనుకరిస్తూ తశైలిని చాటుకున్నారు.
శారీలో లేడీ గెటప్లో కూడా శివప్రసాద్ తన నిరసన తెలిపారు. ప్రధాని మోదీ నిర్ణయాలతో దేశంలోని మహిళలు ఎన్నో ఇబ్బందులు పడుతున్నారని, ఆయన చర్యల కారణంగా ముఖ్యంగా ఏపీ మహిళలు నిరాశా నిస్పృహలతోను, ఆగ్రహంతో ఉన్నారని శివప్రసాద్ అన్నారు. భారత మహిళల్లో అభద్రతా భావం పెరిగిపోతోందని, మోదీ ప్రభుత్వ విధానాలు మహిళలపై దెబ్బ కొట్టేవిగా ఉన్నాయని ఆయన దుయ్యబట్టారు. రేపు ఎలాంటి గెటప్తో నిరసన తెలుపుతారో చూడాలి.