సినీ నటుడు కమెడియన్ ఆలీ చిరవకు వైసీపీలో సెటిల్ అయ్యారు. ఈరోజు జగన్ సమక్షంలో పార్టీ కండువా కప్పుకున్నారు. ఈ సందర్భంగా అలీ పవన్, పవన్ ఫ్యాన్స్పై హాట్ కామెంట్స్ చేశారు.పవన్కు మంచి స్నేహితుడు కాబట్టి అలీ జనసేనలో చేరుతారని అందరూ అనుకున్నారు. కాని అనూహ్యంగా వైసీపీలో చేరారు. స్నేహాం వేరు, రాజకీయాలు వేరని ఆయన స్పష్టం చేశారు. పవన్ కళ్యాణ్ రాజకీయాల్లో సక్సెస్ అయితే తాను విజయం సాధించినట్టుగా భావిస్తానని ఆయన తెలిపారు. టీడీపీలో స్పష్టమైన హామీ లభించనందునే తాను వైసీపీలో చేరినట్టుగా అలీ తేల్చి చెప్పారు.
మరో వైపు పవన్ ఫ్యాన్స్పై హాట్ కామెంట్స్ చేశారు. సోషల్ మీడియాలో టార్గెట్ చేస్తే వాళ్లకు ఎలా సమాధానం చెప్పాలో నాకు తెలుసునన్నారు. తనకెవరు టార్గెట్ కాదని… తాను ఎవరికీ టార్గెట్ కాదన్నారు. టార్గెట్ చేసేవాళ్లు పిచ్చోళ్లు అంటూ… ఎద్దేవా చేశారు.
వైఎస్ జగన్ కమింట్ మెంట్ ఉన్న వ్యక్తి అని కొనియాడారు. తాను ఎన్నికల్లో పోటీ చేయడంలేదని కాని ..వైసీపీ తరపున ప్రచారం చేస్తానని ప్రకటంచారు అలీ. జగన్ చెప్పినట్లుగా పార్టీ కోసం కష్టపడి పనిచేస్తానన్నారు. జగన్ ముఖ్యమంత్రి అయితేనే రాష్ట్రం బాగుంటుందని ప్రజలు కోరుకుంటున్నారని అలీ అన్నారు. ఈ ఎన్నికల్లో తనకు టికెట్ కేటాయించలేనని జగన్ మొహమాటం లేకుండా చెప్పారన్నారు. ప్రజల కోరిక మేరకు ఆయన్ని సీఎం చేయాలన్న ఉద్దేశంతోనే వైసీపీలో చేరానన్నారు.
పాదయాత్ర సమయంలో చాలామందికి కమిట్మెంట్ ఇవ్వడం వల్ల ఇప్పుడు తనకు ఎక్కడ టిక్కెట్ ఇచ్చినా స్థానికంగా వ్యతిరేకత వచ్చే అవకాశం ఉందని జగన్ తనకు వివరించినట్లు అలీ చెప్పారు. జగన్ ఆదేశామేరకు వైసీపీ తరుపున రాష్ట్రం అంతటా తిరిగి ప్రచారం చేస్తానన్నారు.